NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక.. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక.. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు 
    వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక.. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు

    CM Chandrababu: వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక.. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 11, 2025
    08:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో వ్యవసాయ భూములు సంవత్సరం పొడవునా పచ్చగా కళకళలాడాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.

    ఏటా మూడు పంటలు పండే విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

    ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వ్యవసాయ శాఖ సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు.

    వివరాలు 

    వరిలో అంతర పంటలతో ఆదాయాన్ని పెంచే యత్నం 

    వరి పంటల మధ్య అంతర పంటలుగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే ప్రయోగాత్మక విధానాన్ని తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు.

    పొలాల్లో వెడల్పుగా అదనపు గట్లు వేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

    అవసరమైతే ఉపాధిహామీ నిధులను వినియోగించి వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు.

    వరిలో లేదా వరి చుట్టూ ఆక్వా సాగు, ఉద్యానవన పంటల సాగు పైనా ప్రయత్నాలు జరగాలన్నారు.

    వివరాలు 

    వేసవి కాలంలోనూ సాగుకు ప్రణాళిక 

    ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో వచ్చే ఏడాది వేసవిలో కనీసం 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు.

    అనంతపురం వంటి జిల్లాల్లో ఏడాది 365 రోజుల్లో కేవలం నాలుగు నెలలే పంటలు వేసి మిగతా 8 నెలలు భూములను ఖాళీగా వదిలేస్తున్న పరిస్థితిని ఆయన విమర్శించారు.

    దీని వల్ల భూసారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మిగిలిన కాలంలోనూ పంటలు సాగు చేసే విధంగా అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు.

    వివరాలు 

    జల వనరుల ఆధారంగా సాగు ప్రోత్సాహం 

    రాష్ట్రంలో 141 మండలాల్లో జల వనరుల లభ్యత ఉండటంతో, అక్కడ వేసవిలో సాగు కోసం రైతులను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

    19 మండలాలు జలాశయాలపై, 57 మండలాలు చెరువులపై, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.

    ఎరువుల వినియోగం తగ్గించాలి

    భూమి పోషక గుణాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.

    ఎరువుల కొరత ఎక్కడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిరుధాన్యాలు, పప్పుదాన్యాల సాగును పెంచాలని సూచించారు.

    వివరాలు 

    రుణాలు వేగంగా ఇవ్వాలి, వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉండాలి 

    రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలను మంజూరు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

    వాట్సప్ గవర్నెన్స్ - మన మిత్ర ద్వారా వ్యవసాయ శాఖలో కొత్తగా మూడు సేవలు ప్రారంభించిన విషయాన్ని వెల్లడించారు.

    రైతులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మార్గాల్లో వ్యవసాయ విజ్ఞానం పంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

    తుపాన్ల ముప్పు నివారణకు ముందస్తు ప్రణాళిక

    గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రం 14 తుపాన్లను ఎదుర్కొన్నదని, అందులో అక్టోబరులో 5, నవంబరులో 6, డిసెంబరులో 3 తుపాన్లు దెబ్బతీశాయని అధికారులు వివరించారు.

    ముఖ్యంగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాల్లో తుపాన్లు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు.

    దీనికి ప్రతిస్పందనగా ఖరీఫ్‌ పంటల కాలాన్ని ముందుకు జరిపే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు.

    వివరాలు 

    డెల్టాల్లో ముందుగానే సాగునీరు విడుదల 

    ఈ ఏడాది గోదావరి, కృష్ణా డెల్టాలకు ముందుగానే సాగునీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు.

    పశ్చిమ గోదావరి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో కాలువల ద్వారా నీరు అందించినట్లు పేర్కొన్నారు.

    జులై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సాగునీరు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

    పంటల స్థితిగతులపై సమీక్ష

    ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో వరి, కందులు, వేరుశనగ, పత్తి పంటలే ప్రాధాన్యంగా సాగు అవుతున్నాయని.. వీటిలో వేరుశనగ, పత్తి సాగు తగ్గుతూ ఉండగా, కందులు సాగు పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని అధికారులు తెలియజేశారు.

    వివరాలు 

    పొగాకు రైతుల సంతృప్తి, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం 

    పర్చూరు వ్యవసాయ మార్కెట్‌లో హెడ్డీ బర్లీ త్రాగు పొగాకు కొనుగోలు ప్రారంభం కావడంతో రైతుల్లో సంతృప్తి నెలకొందని అధికారులు తెలిపారు.

    ఈ పొగాకు స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. కోకో, మామిడిల కొనుగోలు వివరాలపై సీఎం ప్రత్యేకంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    CM Chandrababu: వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక.. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    Rain Alert: ఏపీకి వారం పాటు భారీ వర్ష సూచన.. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ
    Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా.. వాతావరణం,సాంకేతిక లోపాలే కారణం  స్పేస్-X
    Kuberaa: ముంబయిలో 'కుబేర' నుండి 'పీ పీ డుమ్‌ డుమ్‌' పాట గ్రాండ్ లాంచ్  కుబేర

    చంద్రబాబు నాయుడు

    Nominated Posts: నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి సీఎం చంద్రబాబు ఫోకస్.. మూడు పార్టీల్లో కీలకంగా ఉన్న వారికి పదవులు.. భారతదేశం
    CM Chandrababu: విజయవాడ బైపాస్‌ రోడ్డుకు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌.. జూన్‌ ఆఖరుకు రాకపోకలు భారతదేశం
    Mega DSC: మెగా డీఎస్సీ, ఉద్యోగాల నియామకంపై చంద్రబాబు కీలక ప్రకటన భారతదేశం
    P4 Model: ఏపీలోని  ఆ గ్రామంలో పీ4 లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025