NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  Amaravati: అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
     Amaravati: అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు!
    అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు!

     Amaravati: అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 29, 2025
    11:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటారని ఆయన వెల్లడించారు.

    రాజధాని ప్రాంత రైతులు గత ప్రభుత్వ కాలంలో జరిగిన పరిణామాలతో ఆందోళన చెందుతున్నారని, ఈ విషయాన్ని నిన్న రైతులు సీఎం చంద్రబాబుకు వినిపించారని నారాయణ తెలిపారు.

    న్యాయపరమైన అంశాలపై చర్చించి కేంద్రంతో చర్చిస్తానని సీఎం చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చినట్టు చెప్పారు. మంత్రి నారాయణ మే 2న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు.

    Details

    నరేంద్ర మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం

    రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన, ప్రధాని పర్యటన కోసం అవసరమైన పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.

    రూ. 41 వేల కోట్ల విలువైన పనులకు గతంలో శంఖుస్థాపన జరిగినా అప్పటి ప్రభుత్వం టెండర్లు రద్దు చేయకపోవడంతో న్యాయపరమైన సమస్యలు వచ్చాయని చెప్పారు.

    ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, గత 8 నెలలుగా రాజధాని అభివృద్ధిపై కసరత్తు జరుగుతోందని తెలిపారు.

    మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా పనులు తిరిగి ప్రారంభం కానున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.

    Details

    రాజధాని ప్రాంత రైతులకు భరోసా

    విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ను రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకోవాలని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.

    ఇప్పుడు ఆ గడువు ముగియడంతో, ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.

    ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి, రాజధాని ప్రాంత రైతులకు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    అమరావతి

    Amaravati: అమరావతిలో బిట్స్‌ క్యాంపస్.. ఆలయ నమూనాలో నిర్మాణం ఆంధ్రప్రదేశ్
    Amaravati Construction: అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిన సీఆర్డీఏ..   భారతదేశం
    Amaravati: రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు టెండర్లు  భారతదేశం
    CM Chandrababu: 'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    AP Inter Results 2025: ఏపీ ఇంటర్‌ ఫలితాల విడుదల.. పరీక్ష ఫలితాలను ఇక్కడ చూడండి! ఇంటర్
    IAS : ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఎనిమిది మందికి పోస్టింగ్ మార్పు ఇండియా
    AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. సీఆర్డీఏ ఆథారిటీ చర్చించిన అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. భారతదేశం
    AndhraPradesh: ఏపీలో చేపల వేటపై నిషేధం రెండు నెలల పాటూ వేట బంద్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025