Page Loader
Srisailam reservoir: 881 అడుగులకు చేరిన శ్రీశైలం జలాశయం.. నేడు సీఎం చంద్రబాబు జలహారతి
881 అడుగులకు చేరిన శ్రీశైలం జలాశయం.. నేడు సీఎం చంద్రబాబు జలహారతి

Srisailam reservoir: 881 అడుగులకు చేరిన శ్రీశైలం జలాశయం.. నేడు సీఎం చంద్రబాబు జలహారతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
08:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనివల్ల శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి ప్రతిసెకనుకు 1,72,705 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 881.60 అడుగులకు చేరుకుంది. మొత్తం నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ఇప్పటికే 196.56 టీఎంసీల నీరు నిల్వలో ఉంది. ఈ వరద నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు శ్రీశైలం కుడిగట్టు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అదే సమయంలో 67,563 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

వివరాలు 

శ్రీశైలం డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో, ఈ రోజు ఉదయం శ్రీశైలం డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై కృష్ణానదికి జలహారతి అర్పించనున్నారు. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లె రాజశేఖర్ సమీక్షించారు.