Page Loader
CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు 
CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు

CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు 

వ్రాసిన వారు Stalin
Feb 21, 2024
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వైజాగ్‌లోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. వార్షికోత్సవాల్లో సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన సీఎం.. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ సీఎం జగన్‌తో పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ కూడా పాల్గొన్నారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో వైజా‌గ్‌కు విశాఖపట్నం చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రి బొత్స, ధర్మాన కష్ణదాస్, వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 పూజలు చేస్తున్న సీఎం జగన్