NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
    భారతదేశం

    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 15, 2023, 03:31 pm 0 నిమి చదవండి
    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
    కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సీఎం కేసీఆర్

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న క్షేత్రం అభివృద్ధికి మరో రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఉదయం కొండగట్టుకు హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం కేసీఆర్, తొలుత నాచుపల్లి సమీపంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో దిగారు. అక్కడి నుంచి బస్సులో యాగశాలకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    కొండగట్టు క్షేత్రాన్ని ప్రముఖ ఆలయంగా తీర్చిదిద్దుతాం: సీఎం కేసీఆర్

    అంజన్నకు పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ అభివృద్ధికి మరో రూ. 500కోట్లను కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఆలయానికి రూ. రూ.100 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో కొండగట్టు ఆలయానికి సీఎం కేసీఆర్ మొత్తం రూ.600కోట్లను కేటాయించినట్లయ్యింది. కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని త్వరలోనే ప్రముఖ ఆలయంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, టీఎస్‌ ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, రాజ్యసభ ఎంపీ దివకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, భానుప్రసాదరావు కొండగట్టును సందర్శించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ
    ముఖ్యమంత్రి
    కరీంనగర్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్
    తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే తెలంగాణ బడ్జెట్
    ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్
    కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్
    తెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లు; లోక్‌సభ్‌లో కేంద్రం ప్రకటన పంకజ్ చౌదరీ
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    ముఖ్యమంత్రి

    కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌ కడప
    ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం మానిక్ సాహా
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్

    కరీంనగర్

    తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం తెలంగాణ లేటెస్ట్ న్యూస్
    జగిత్యాల: 12చేతి వేళ్లు, 12కాలి వేళ్లతో జన్మించిన శిశువు జగిత్యాల
    తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన తెలంగాణ
    కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా ఇండియా లేటెస్ట్ న్యూస్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023