Page Loader
Mamata Benarjee: బెంగాల్‌లో వరదలు.. కేంద్రంపై మమతా బెనర్జీ ఆరోపణలు
బెంగాల్‌లో వరదలు.. కేంద్రంపై మమతా బెనర్జీ ఆరోపణలు

Mamata Benarjee: బెంగాల్‌లో వరదలు.. కేంద్రంపై మమతా బెనర్జీ ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2024
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం మమతా బెనర్జీ సందర్శించారు. ఈ వరదలకు కేంద్ర ప్రభుత్వంపై కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) డ్యామ్‌ల వద్ద సరైన డ్రెడ్జింగ్ జరగకపోవడం వల్లే బెంగాల్‌లో వరదలు జరిగాయన్నారు. ఈ మానవ కారణంతో వచ్చిన వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఝార్ఖండ్-బెంగాల్ సరిహద్దులో ఉన్న మైథాన్, పంచేత్‌ల వద్ద డీవీసీ డ్యామ్‌లు ఉండగా.. డీవీసీ ఈ ఏడాది 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల తాజా పరిస్థితి ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు.

వివరాలు 

వరదలతో నష్టపోయిన వారికి తగిన సహాయం 

గురువారం పశ్చిమ మేదినీపుర్ జిల్లా పష్కురా వద్ద వరద పరిస్థితులను పరిశీలించిన మమతా, డీవీసీతో అన్ని సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించారు. వరదలతో నష్టపోయిన వారికి తగిన సహాయం అందించేందుకు అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపింది.