LOADING...
Revanth Reddy: జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ.. పర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 
జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ.. పర్చువల్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ.. పర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనానే అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ ప్రయోజనార్థం ప్రభుత్వము మొత్తం రూ. 5.80 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పల్లెటూరి మహిళా రైతు రూపంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పసుపు అంచుతో కూడిన ఆకుపచ్చ చీర, నుదుటిపై ఎర్రబొట్టు, కాళ్లకు కడియాలు, ముక్కుపుడక, మట్టి గాజులు, గుండు పూసల హారం వంటి సంప్రదాయ అలంకారాలతో విగ్రహాన్ని రూపకల్పన చేశారు.

Details

 ఒక్కో విగ్రహం తయారీకి సుమారు రూ. 17.50 లక్షలు ఖర్చు 

ఎడమ చేతిలో మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులు పట్టుకుని చిరునవ్వుతో నిలిచే రీతిలో మూర్తిని రూపొందించారు. ఈ విగ్రహం భూమి నుంచి మొత్తం 18 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందులో 12 అడుగుల విగ్రహం, 6 అడుగుల ప్రాతిమిక దిమ్మె భాగమవుతాయి. ఒక్కో విగ్రహం తయారీకి సుమారు రూ. 17.50 లక్షలు ఖర్చు చేశారు. డిసెంబర్ 9న 'తెలంగాణ తల్లి దినోత్సవం'గా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా, దాని భాగంగానే నేడు ఈ విగ్రహాల ఆవిష్కరణ జరిగింది.

Advertisement