NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు
    తదుపరి వార్తా కథనం
    ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు
    50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు

    ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 29, 2023
    01:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఇరకాటంలో పడ్డారు. త్వరలోనే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

    ఈ క్రమంలోనే సీఎం చౌహన్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శస్త్రానాలను సంధిస్తోంది.

    చౌహన్ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందంటూ హాట్ పోస్టర్స్ రిలీజ్ చేసింది. రాజధాని భోపాల్‌ నగర వీధుల్లో ఆయా వాల్ పోస్టర్లను అంటించింది.

    ఇందులో భాగంగా ఫోన్‌పే లోగో తరహాలో పేమెంట్ యాప్ ను డిజైన్ చేసి వినియోగించింది.

    మరోవైపు అనుమతి లేకుండా తమ లోగోను వినియోగించడంపై ఫోన్ పే యాప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు లోగోను మరోసారి వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని హెచ్చరించింది.

    DETAILS

    కర్ణాటక ఎన్నికల్లోనూ ఇదే తరహా ప్రచారం

    ప్రభుత్వంపై నిరసనల్లో భాగంగానే క్యూఆర్ కోడ్ మధ్యలో ముఖ్యమంత్రి చౌహన్ ఫొటో ఏర్పాటు చేశారు. ఏ పని జరగాలన్నా 50 శాతం మేర కమిషన్ ఇవ్వాలంటూ పోస్టర్లు వెలిశాయి.

    సదరు పోస్టర్ల నుంచి తమ సంస్థ లోగోను వెంటనే తొలగించాలని ఫోన్ పే డిమాండ్ చేసింది. ఎవరైనా సరే అనుమతి లేకుండా తమ లోగోను వాడకూడదని తేల్చి చెప్పింది.

    ఏ రాజకీయ పార్టీతోనూ తమకు సంబంధం లేదని వెల్లడించింది. ఇటీవలే కర్ణాటక ఎన్నికల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా పోస్టర్లే వెలిశాయి. అక్కడి ప్రభుత్వం అవినీతిమయం అంటూ పేసీఎం పేరిట పోస్టర్లు భారీగా ఏర్పాటు చేశారు.

    ఒకరకంగా కన్నడనాటలో పేసీఎం ప్రచారం బీజేపీ ఓట్లకు కొంత మేర గండికొట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    కాంగ్రెస్
    శివరాజ్ సింగ్ చౌహాన్

    తాజా

    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్
    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్
     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    కాంగ్రెస్

    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం  కర్ణాటక
    కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి కర్ణాటక
    బజరంగ్‌దళ్‌ను పీఎఫ్‌ఐతో పోల్చినందుకు ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు  మల్లికార్జున ఖర్గే
    నా నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయి: డీకే శివకుమార్ సంచలన కామెంట్స్  కర్ణాటక

    శివరాజ్ సింగ్ చౌహాన్

    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025