NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cm Jagan : సీఎం జగన్ సహా 41మందికి నోటీసులు..రఘురామ పిటిషన్ విచారణ
    తదుపరి వార్తా కథనం
    Cm Jagan : సీఎం జగన్ సహా 41మందికి నోటీసులు..రఘురామ పిటిషన్ విచారణ
    రఘురామ పిటిషన్ విచారణ

    Cm Jagan : సీఎం జగన్ సహా 41మందికి నోటీసులు..రఘురామ పిటిషన్ విచారణ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 23, 2023
    03:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో 40 మంది ఈ జాబితాలో ఉన్నారు.

    ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (MP Raghurama) దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

    ఈ మేరకు సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

    రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయన్న రఘురామ, వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)తో విచారణ జరిపించాలని పిటిషన్'లో కోరారు.

    DETAILS

    అసలు ఈ పిటిషన్'కు అర్హత లేదన్న ఏజీ, కాదన్న డిఫెన్స్ 

    ఈ క్రమంలోనే విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ (AG Sri ram) వాదించారు.

    సదరు పిటిషన్'లో ప్రజా ప్రయోజనం ఏమీ లేదని,కేవలం వ్యక్తిగత దురుద్దేశంతోనే దాఖలు చేశారని ఏజీ కోర్టుకు వివరించారు.ఒకరకంగా ఈ పిటిషన్'కు విచారణ అర్హత లేదన్నారు.

    పిటిషన్ దాఖలు అనంతరం 'ప్రభుత్వ అవినీతి' అని మీడియాలో రఘురామ కృష్ణం రాజు మాట్లాడారని ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

    ఇదే సమయంలో రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదించారు. ఈ పిటిషన్ ఫైల్ కాగానే ప్రభుత్వం పలు రికార్డులను ధ్వంసం చేసిందని కోర్టుకు తెలిపారు.

    ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణ వాయిదా వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    హైకోర్టు

    తాజా

    Mumbai: ముంబైకి వెళ్తున్నారా? అయితే ఈ అద్భుత ప్రదేశాలు తప్పక చూడాలి! ముంబై
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..!  ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు యూఏఈలో సంప్రదాయ స్వాగతం .. ఇంతకీ ఈ సంప్రదాయం ఏంటంటే?(వీడియో)  డొనాల్డ్ ట్రంప్
    Renu Desai: అర్థం లేని చర్చలు మానేసి, దేశాభిమానంతో ముందుకెళ్లండి: రేణూ దేశాయ్ టాలీవుడ్

    ఆంధ్రప్రదేశ్

    చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు  చంద్రబాబు నాయుడు
    దక్షిణ భారతదేశంలో నవరాత్రులు, దసరా ఉత్సవాలు ఎలా జరుపుకుంటారంటే.. దసరా నవరాత్రి 2023
    స్కిల్ డెవలప్ మెంట్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్  సీఐడీ
    CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  ఆంధ్రప్రదేశ్
    వైఎస్‌ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు  హైకోర్టు

    హైకోర్టు

    బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ బిహార్
    బుద్వేల్ భూముల వేలానికి హెచ్ఎండీఏకు గ్రీన్ సిగ్నల్.. ఎకరం ధర రూ.30 కోట్లకుపైనే తెలంగాణ
    సుప్రీంకోర్టు మెగా బదిలీలు.. రాహుల్‌ గాంధీకి స్టే నిరాకరించిన ఆ జడ్జి బదిలీ రాహుల్ గాంధీ
    కేరళ: పాఠశాలలో పోక్సో చట్టం బోధనలు.. అవగాహన కల్పించేలా పాఠాలు  కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025