NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu-Revanth Reddy: ఇవాళ దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu-Revanth Reddy: ఇవాళ దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
    ఇవాళ దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు

    Chandrababu-Revanth Reddy: ఇవాళ దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 20, 2025
    09:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్తున్నారు.

    ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మూడ్రోజుల పాటు మంత్రి, రాష్ట్ర బృందంతో విశేషంగా పర్యటించనున్నారు.

    'బ్రాండ్ ఏపీ' ప్రమోషన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ సీఎం బృందం ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. చంద్రబాబు వెంట నారా లోకేష్, టీజీ భరత్, ఈడీబీ అధికారులు పాల్గొననున్నారు.

    లక్ష్మీ మిత్తల్‌తో చంద్రబాబు ప్రత్యేక సమావేశంలో నిర్వహిస్తుండగా, రేవంత్ రెడ్డి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొననున్నారు.

    Details

    చంద్రబాబు పర్యటన వివరాలివే

    ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు హాజరయ్యే దావోస్ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనడం ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    ఈ పర్యటనలో సీఎం వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఏపీలోని పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరపనున్నారు.

    సోమవారం జ్యూరిచ్‌లో సీఎం చంద్రబాబు 10 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.

    హోటల్ హయత్‌లో జరిగే 'మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా' కార్యక్రమంలో తెలుగు పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు.

    సస్యశ్యామల ఇంధనం, గ్రీన్ ఎనర్జీపై చర్చించనున్నారు. సోలార్ ఇంపల్స్, వెల్‌స్పన్, కోకకోలా, ఎల్‌జీ, కార్ల్స్‌బర్గ్, వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్, సిస్కో, కాగ్నిజెంట్ సంస్థల ఛైర్మన్లు, సీఈఓలతో సమావేశం కానున్నారు.

    Details

    తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు రేవంత్ రెడ్డి కృషి

    ఐటీ, ఫార్మా, బయోసైన్స్ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల అధినేతలు, బిజినెస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు.

    ఈభేటీల ద్వారా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహాన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

    దావోస్ పర్యటనలో ఐటీ, ఫార్మా,బయోసైన్స్, డేటా సెంటర్లలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

    యువత నైపుణ్యాలను పెంచేందుకు ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీలు ముఖ్య పాత్ర పోషించనున్నాయి. గతేడాది దావోస్ పర్యటనలో తెలంగాణకు రూ. 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

    తెలంగాణ ప్రభుత్వం ఈ పర్యటన ద్వారా పెట్టుబడులను పెంచడమే కాకుండా ఫార్మా, ఐటీ, డేటా సెంటర్లు వంటి కీలక రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    రేవంత్ రెడ్డి

    తాజా

    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి.. ఇళ్లు కట్టించి ఇస్తాం: చంద్రబాబు  భారతదేశం
    Nara Ramamurthy Naidu: నారా రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమం.. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు నారా లోకేశ్
    Nara Rohith : నారా రోహిత్ కుటుంబంలో విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత  నారా రోహిత్
    Nara Rohit: 'నాన్నా మీతో జీవితం మరచిపోలేను'.. ట్విట్టర్‌లో‌ నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్ నారా రోహిత్

    రేవంత్ రెడ్డి

    Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి తెలంగాణ
    Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై కాన్వాయ్‌ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఉండవు! తెలంగాణ
    CM Revanth Reddy: మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి మహారాష్ట్ర
    Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025