Page Loader
Rajasthan: షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. పోలింగ్ వాయిదా 
షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత

Rajasthan: షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. పోలింగ్ వాయిదా 

వ్రాసిన వారు Stalin
Nov 15, 2023
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్నిరోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. రాజస్థాన్‌లోని కరణ్‌పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు. దిల్లీ ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కున్నార్‌ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో గుర్మీత్ సింగ్‌ను జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజస్థాన్‌‌లో నవంబర్ 25న పోలింగ్ జరగాల్సి జరగనుంది. ఈ నేపథ్యంలో కరణ్‌పూర్‌లో పోలింగ్ వాయిదా పడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్