
బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు
ఈ వార్తాకథనం ఏంటి
తొలి భారత గవర్నర్ జనరల్, కాంగ్రెస్ దిగ్గజం సి.రాజగోపాలాచారి మనవడు, తమిళనాడుకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండు నెలల తర్వాత ఆయన బీజేపీలో చేరారు.
ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీలో తనను చేర్చుకున్నందుకు అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సీఆర్ కేశవన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వం దేశంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చిందని అన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని, ఆయన తమను సరైన మార్గంలో తీసుకెళ్తారని చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీజేపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేశవన్
ராஜாஜி அவர்களின் கொள்ளுப் பேரன் திரு @crkesavan அவர்கள் காங்கிரஸ் கட்சியிலிருந்து விலகி நமது பாரத பிரதமர் திரு நரேந்திர மோடி அவர்களின் நல்லாட்சியால் ஈர்க்கப்பட்டு இன்று தன்னை @BJP4Indiaவில் இணைத்துக் கொண்டார். @BJP4TamilNadu சார்பாக அவரை மனமார வரவேற்கிறேன். #Vanakkam_Modi pic.twitter.com/q03nTeh0FS
— K.Annamalai (@annamalai_k) April 8, 2023