NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karti Chidambaram:వారానికి 4 రోజుల పనే.. నారాయణ మూర్తి '70 పని గంటలకు  ఎంపీ కార్తీ చిదంబరం కౌంటర్  
    తదుపరి వార్తా కథనం
    Karti Chidambaram:వారానికి 4 రోజుల పనే.. నారాయణ మూర్తి '70 పని గంటలకు  ఎంపీ కార్తీ చిదంబరం కౌంటర్  
    వారానికి 4 రోజుల పనే.. నారాయణ మూర్తి '70 పని గంటలకు ఎంపీ కార్తీ చిదంబరం కౌంటర్

    Karti Chidambaram:వారానికి 4 రోజుల పనే.. నారాయణ మూర్తి '70 పని గంటలకు  ఎంపీ కార్తీ చిదంబరం కౌంటర్  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 23, 2024
    12:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి.

    ఇటీవల ఆయన ఈ అంశంపై మరింతగా వివరణ ఇచ్చారు.

    ''భారత్‌ ఐదు రోజుల పని పద్ధతికి మారాలని నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. నేను వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌లో విశ్వసించను. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్రాంతి అవసరం కాదని, భారతీయులు త్యాగాలు చేయాలి'' అని పేర్కొన్నారు.

    ఆయన ప్రతిరోజు ఉదయం 6.30 గంటలకు ఆఫీసుకు వెళ్లి రాత్రి 8.40 గంటలకు తిరిగి వస్తానని, వారానికి ఆరున్నర రోజులు పనిచేస్తానని చెప్పారు.

    వివరాలు 

    మనం వారానికి 4 రోజులు పనిచేయడం మంచిది: కార్తీ చిదంబరం

    ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం స్పందిస్తూ, సుదీర్ఘంగా పని చేయడం అనేది అర్థరహితం కాదని, దానికన్నా సమర్థతపై దృష్టి పెట్టడం అవసరమని తెలిపారు.

    ''మన దేశంలో ఉద్యోగుల రోజు-ప్రతి జీవితం ఒక పోరాటమే. అసమర్థమైన మౌలిక సదుపాయాలను ఎదుర్కొంటూ మనం కొనసాగుతున్నాం. మంచి సామాజిక వాతావరణం, సామరస్య స్థితి కోసం వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ ముఖ్యమని'' అన్నారు.

    ''మనం వారానికి 4 రోజులు పనిచేయడం మంచిది'' అని కాంగ్రెస్‌ ఎంపీ వివరించారు.

    వివరాలు 

    అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడాలంటే.. 70 గంటలు పనిచేయాలి 

    ఇదిలా ఉంటే, ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ వ్యాఖ్యానించిన 'ది రికార్డ్‌' పాడ్‌కాస్ట్‌లో నారాయణమూర్తి, ''ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉంది. అందుకే దేశ యువతకు మరిన్ని గంటలు పని చేయాలని'' అన్నారు.

    ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ''జపాన్‌, జర్మనీ వంటి దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎంత కష్టపడ్డాయో, మనం కూడా అలాగే శ్రమించాలి'' అన్నారు.

    అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడాలంటే భారత యువత 70 గంటలు పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై మిశ్రమ స్పందనలు రావడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇన్ఫోసిస్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఇన్ఫోసిస్

    Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం  బిజినెస్
    Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్  తాజా వార్తలు
    Narayana Murthy : డీప్‌ఫేక్ వీడియోలపై హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. నేను అలా అనలేదు, ఎవరూ నమ్మకండి  డీప్‌ఫేక్‌
    Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు  విప్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025