NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు
    తదుపరి వార్తా కథనం
    కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు
    స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్జారు

    కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు

    వ్రాసిన వారు Stalin
    Feb 24, 2023
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు జరిగే పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం గమనార్హం.

    మూడు రోజుల సెషన్‌లో భాగంగా మొదటిరోజు పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికను ప్రాథమికంగా ఆమోదించి, ఆయన నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ సమావేశమైంది.

    అనంతరం సీడబ్య్లూసీకి ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. కొత్త సీడబ్య్లూసీ కమిటీ ఏర్పడే వరకు వర్కింగ్ కమిటీ పాత్రను స్టీరింగ్ కమిటీ పోషిస్తుంది.

    సాయంత్రం 4గంటలకు సబ్జెక్టుల కమిటీ సమావేశం అవుతుంది. ఈ సందర్భంగా పలు తీర్మానాలను రూపొందిచంనున్నారు.

    కాంగ్రెస్

    ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై అధిష్ఠానం ఫోకస్

    ఈ ఏడాది కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు పరీక్షగా మారాయి.

    అలాగే 2024లో సార్వత్రిక ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ప్లీనరీలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

    ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన రోడ్‌మ్యాప్‌పై అధిష్ఠానం ఫోకస్ పెట్టనుంది.

    బీజేపీని ఎదుర్కోవడానికి భావసారూప్యత గల పార్టీలతో ఎన్నికల పొత్తు పెట్టుకునే వ్యూహాన్ని ఖరారు చేయాలని కాంగ్రెస్ నాయక్వతం భావిస్తోంది.

    ఫిబ్రవరి 26న మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రసంగం ఉంటుంది. ఆరోజు సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ అనంతరం ప్లీనరీ ముగుస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    సోనియా గాంధీ
    రాహుల్ గాంధీ

    తాజా

    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    కాంగ్రెస్

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ దిల్లీ
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు బీజేపీ
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు జమ్ముకశ్మీర్
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కేరళ

    సోనియా గాంధీ

    'అప్పటి వరకు టీషర్ట్ మీదనే ఉంటా'.. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ ఆసక్తికర కామెంట్స్ భారతదేశం
    రాహుల్ భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు.. కేంద్రం ఏం అంటోంది? భారతదేశం
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్

    రాహుల్ గాంధీ

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్ జమ్ముకశ్మీర్
    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం' కాంగ్రెస్
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ జమ్ముకశ్మీర్
    నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025