NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది?
    తదుపరి వార్తా కథనం
    ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది?
    ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ

    ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది?

    వ్రాసిన వారు Stalin
    Feb 19, 2023
    01:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫిబ్రవరి 24నుంచి 26వరకు నయా రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే నియామకాన్ని ఆమోదించనున్నారు. ప్లీనరీలోనే కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని కూడా ఎన్నుకోనున్నారు. అయితే సీడబ్ల్యూసీని ఎలా ఏర్పాటు చేస్తారనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    కొత్త అధ్యక్షుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని మొత్తాన్నినేరుగా నియమిస్తారా? లేకుంటే పాత సంప్రదాయాన్నేకొనసాగిస్తారా? అని కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారు.

    సీడబ్ల్యూసీలో పార్టీ అధ్యక్షుడితో సహా 25 మంది సభ్యులుంటారు. పన్నెండు మందిని పార్టీ చీఫ్ నామినేట్ చేస్తారు. మిగిలిన 12 మందిని ఏఐసీసీ సభ్యులు ఎన్నుకుంటారు.

    కాంగ్రెస్

    కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ, ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

    రాయ్‌పూర్‌లో జరిగే ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. ఏఐసీసీ సభ్యులను ఆరు గ్రూపులుగా విభజించి, ఒక్కో విభాగానికి ఒక్కో బాధ్యతను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించి ప్లీనరీలో తీర్మానం చేయనున్నారు. అలాగే సీడబ్ల్యూసీ ఎన్నికల విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఈ ఏడాది కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు పరీక్షగా మారాయి. ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    సోనియా గాంధీ
    రాహుల్ గాంధీ

    తాజా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్

    కాంగ్రెస్

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ దిల్లీ
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు బీజేపీ
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు జమ్ముకశ్మీర్
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కేరళ

    సోనియా గాంధీ

    'అప్పటి వరకు టీషర్ట్ మీదనే ఉంటా'.. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ ఆసక్తికర కామెంట్స్ భారతదేశం
    రాహుల్ భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు.. కేంద్రం ఏం అంటోంది? భారతదేశం
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    రాహుల్ గాంధీ

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్ జమ్ముకశ్మీర్
    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం' కాంగ్రెస్
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ కాంగ్రెస్
    నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025