NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి
    కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి
    భారతదేశం

    కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి

    వ్రాసిన వారు Naveen Stalin
    February 14, 2023 | 07:07 pm 1 నిమి చదవండి
    కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి
    కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పొత్తుపై జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి

    కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మెజార్టీ రాదని, అందుకే కేసీఆర్ బీజేపీతో బదులు లౌకిక పార్టీ అయిన తమతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గ్రాఫ్ పెరుగుతోందని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లు, జూనియర్లను పక్కన పెట్టాలని, ఎన్నికల్లో గెలిచే వారికే టిక్కెట్లు ఇవ్వాలని సూచించారు.

    బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఏదో ఒకరోజు కలుస్తాయి: బీజేపీ

    టీ-కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అయితే ఎన్నికల తర్వాత పొత్తు అనివార్యమని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో టీ-కాంగ్రెస్‌కు మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కొందరు నేతలు తమ బాధ్యతారాహిత్య ప్రకటనలతో అనవసరంగా కాంగ్రెస్ కేడర్‌లో గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఒకే నాణేనికి బొమ్ము, బొరుసు లాంటివని, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఏదో ఒకరోజు కలుస్తాయని, కోమటిరెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని లక్ష్మణ్‌ అన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    కాంగ్రెస్
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    తెలంగాణ

    తెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లు; లోక్‌సభ్‌లో కేంద్రం ప్రకటన పంకజ్ చౌదరీ
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల ఎన్నికల సంఘం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత

    కాంగ్రెస్

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం బీబీసీ
    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం త్రిపుర
    వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ లోక్‌సభ
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ
    ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! ఒడిశా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023