NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ 
    దిల్లీ ఎన్నికలు.. ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్

    Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    02:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, దిల్లీలోని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.

    ఈ సందర్భంగా, కాంగ్రెస్ తాజాగా ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసింది.

    ఇందులో 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు, మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సహాయం ప్రకటించింది.

    దిల్లీ ప్రజలకు 'అందరికీ ఆరోగ్యం' పథకం కింద రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా, మెహంగై ముక్తి యోజన కింద ఒక్కో సిలిండర్‌ను రూ.500కు అందించడంతో పాటు ఉచిత రేషన్ కిట్‌ను అందించనుంది.

    సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, పేదలకు నెలకు రూ.5,000 పెన్షన్‌ను ప్రకటించింది.

    వివరాలు 

    మ్యానిఫెస్టో విడుదల చేసిన జైరాం రమేశ్,దేవేంద్ర యాదవ్

    యువతకు ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఏడాది అప్రెంటీస్‌షిప్‌తో పాటు నెలకు రూ.8,500 స్టైఫండ్ అందిస్తామని హామీ ఇచ్చింది.

    'ప్యారీ దీదీ' పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సహాయం అందించనుంది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఈ మ్యానిఫెస్టోలో ముఖ్యమైన హామీగా ఉంది.

    కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ బుధవారం ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

    వివరాలు 

    ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రచారం

    ఈ సందర్భంగా జైరాం రమేశ్ మాట్లాడుతూ, 'దిల్లీ ప్రజల కోసం ఐదు గ్యారెంటీలు ప్రకటించాం. గ్యారెంటీ అంటే ప్రజల హక్కు. ఆప్, భాజపా దిల్లీ కాలుష్యాన్ని నివారించడంలో విఫలమయ్యాయి' అని విమర్శించారు. అలాగే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని, పూర్వాంచల్ ప్రజల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని దేవేంద్ర యాదవ్ ప్రకటించారు.

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగనున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు.

    ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    కాంగ్రెస్

    Kharge-Modi : ఖర్గే-మోదీ మధ్య మాటల యుద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌పై పరస్పర విమర్శలు బీజేపీ
    Delhi Nyay Yatra: నేడు రాజ్‌ఘాట్ నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ ఢిల్లీ 'న్యాయ యాత్ర ' దిల్లీ
    Prajwal Shetty: కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం కర్ణాటక
    Assembly Polls: ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌లకు కాంగ్రెస్ దూరం మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025