NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana congress: కాంగ్రెస్ రెండో జాబితో 22మంది రెడ్లు, 8మంది బీసీలు
    తదుపరి వార్తా కథనం
    Telangana congress: కాంగ్రెస్ రెండో జాబితో 22మంది రెడ్లు, 8మంది బీసీలు

    Telangana congress: కాంగ్రెస్ రెండో జాబితో 22మంది రెడ్లు, 8మంది బీసీలు

    వ్రాసిన వారు Stalin
    Oct 28, 2023
    09:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.

    దీంతో మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.

    నవంబర్ 2 నాటికి మిగిలిన 19 స్థానాలకు మూడో జాబితాను విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది.

    అక్టోబర్ 15న 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.

    రెండో జాబితాలో 8మంది బీసీ అభ్యర్థులు, రెడ్డి సామాజికవర్గం నుంచి 22 మంది, కమ్మ సామాజికవర్గం నుంచి ముగ్గురు, బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి ఒకరు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 11మంది అభ్యర్థులు ఉన్నారు.

    కాంగ్రెస్

    కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ?

    కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌, సిరిసిల్లలో కేటీఆర్‌కు పోటీగా కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దింపుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

    ఇది మూడో జాబితాలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    కామారెడ్డి సిటును ఆశిస్తున్న సీనియర్ నేత షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ సీటు నుంచి కాంగ్రెస్ పోటీలో నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి టి.హరీష్‌రావుపై పూజల హరికృష్ణ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మహేశ్వరం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు.

    కాంగ్రెస్

    బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి వచ్చిన వారికి టెకెట్లు

    ఇటీవల బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి రెండో జాబితాలో టికెట్లు దక్కాయి.

    ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తాండూరు నుంచి బుయ్యని మనోహర్‌రెడ్డి, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, వి.శేరిలింగంపల్లి నుంచి జగదీశ్వర్ గౌడ్ టికెట్లు దక్కిచంచుకున్నారు.

    జూబ్లీహిల్స్‌ నుంచి మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ బరిలోకి దిగగా, అంబర్‌పేట నుంచి ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సి.రోహిణ్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారు.

    బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దివంగత కాంగ్రెస్‌ నేత పి.జనార్దన్‌రెడ్డి కుమార్తె పి.విజయారెడ్డికి ఖైరతాబాద్‌ నుంచి టికెట్‌ లభించగా, ఆయన కుమారుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌ నుంచి టికెట్‌ నిరాకరించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రెండో జాబితా ఇదే..

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసిసి విడుదల చేసిన అభ్యర్థుల జాబితా - 2023 pic.twitter.com/WZp1cj3s2M

    — Telangana Congress (@INCTelangana) October 27, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    అసెంబ్లీ ఎన్నికలు
    తెలంగాణ
    తాజా వార్తలు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    కాంగ్రెస్

    ఇండియాపై కాంగ్రెస్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు.. వలసవాద దేశం పెట్టిన పేరుపై జిన్నాకూ అభ్యంతరం భారతదేశం
    తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ 5 వరాలు..10 లక్షల మందితో సోనియా గాంధీ భారీ సభ తెలంగాణ
    తెలంగాణలో కాంగ్రెస్‌-సీపీఐ చర్చలు సఫలం.. సీపీఐ, సీపీఎంలకు ఎన్ని టిక్కెట్లో తెలుసా  తెలంగాణ
    నుహ్ మత ఘర్షణ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్  హర్యానా

    అసెంబ్లీ ఎన్నికలు

    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక
    కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్  నరేంద్ర మోదీ
    తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా.. మార్గదర్శకాలు విడుదల చేసిన సీఈసీ తెలంగాణ
    ఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం  ఎన్నికల సంఘం

    తెలంగాణ

    TSRTC: ఈనెల 13 నుంచి 24 వరకు స్పెషల్ బస్సులు - బతుకమ్మ,దసరాకు ప్రత్యేక ఏర్పాట్లు టీఎస్ఆర్టీసీ
    నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ   అమిత్ షా
    Minister Srinivas Goud: తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊరట  వి.శ్రీనివాస్ గౌడ్
    TELANGANA : గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. కొత్త తేదీలు ఇవే  టీఎస్పీఎస్సీ

    తాజా వార్తలు

    గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు  హమాస్
    BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ఖరారైన బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు బీజేపీ
    గాజా ఆస్పత్రిపై దాడిపై ప్రధాని మోదీ విచారం.. కారకులను వదిలిపెట్టొద్దని ట్వీట్  నరేంద్ర మోదీ
    అదానీ బొగ్గు కుంభకోణం వల్లే విద్యుత్ ధరలు పెరిగాయ్: రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025