దేశంలో కొత్తగా 1,272మందికి కరోనా; యాక్టివ్ కేసులు 15,515
దేశంలో 24 గంటల్లో 1,272 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజా కేసులతో యాక్టివ్ కేసులు 15,515కి తగ్గాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉన్నాయి. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లు (4,49,80,674)కు చేరుకున్నాయి. దేశంలో కరోనాతో కొత్తగా ముగ్గురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 5,31,770కు చేరుకున్నాయి. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.78 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,33,389కి పెరిగింది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.