తదుపరి వార్తా కథనం

దేశంలో కొత్తగా 865మందికి కరోనా; యాక్టివ్ కేసులు 9,092
వ్రాసిన వారు
Stalin
May 19, 2023
11:31 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో 865 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.
తాజా కేసులతో యాక్టివ్ కేసులు 9,092కి చేరుకున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశంలో తాజాగా 4మరణాలు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
దీంతో మొత్తం మరణాలు 5,31,818కి పెరిగాయి. ఇప్పటి వరకు దేశంలో 4.49 కోట్ల(4,49,84,923) కేసులు నమోదైనట్లు కేంద్రం చెప్పింది. క్రియాశీల కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.02 శాతం ఉన్నాయి.
అయితే జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,44,013కి పెరిగింది. కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) May 19, 2023
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/wFg4ihArDk pic.twitter.com/LICJ5g6mJF