NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు
    తదుపరి వార్తా కథనం
    కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు
    అంతర్జాతీయ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు

    కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు

    వ్రాసిన వారు Stalin
    Dec 24, 2022
    10:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనాతో పాటు అనేక దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈమేరకు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల్లో కనీసం 2శాతం మందికి కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. శనివారం నుంచే ఈ పరీక్షలు చేయనున్నారు.

    తాజాగా చైనాలో వైరస్ వ్యాప్తిపై బ్లూమ్‌బెర్గ్ వెల్లడించిన నివేదిక ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలో డిసెంబర్ 20నాటికి మొత్తం జనాభాలో 18శాతం లేదా.. 248 మిలియన్ల మంది వైరస్ బారిన పడి ఉండవచ్చని అంచనా వేసింది. ఈనేపథ్యంలోనే భారత్‌కు కూడా దేశంలో నాలుగో వేవ్‌కు అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.

    క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకొని.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

    కరోనా

    టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకాపై దృష్టి

    పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని.. టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకాపై దృష్టి సారించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చుని, మాస్కులు ధరించడం, శానిటైజేషన్‌, సామాజిక దూరాన్ని పాటించడం లాంటి కరోనా నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

    కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించి.. కీలక సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు చెప్పారు. మహమ్మారి నివారణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుందని రాష్ట్రాలకు భరోసా ఇచ్చారు.

    గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులను సిద్ధం చేసేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    భారతదేశం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025