NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు
    భారతదేశం

    కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు

    కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 24, 2022, 10:09 am 1 నిమి చదవండి
    కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు
    అంతర్జాతీయ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు

    చైనాతో పాటు అనేక దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈమేరకు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల్లో కనీసం 2శాతం మందికి కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. శనివారం నుంచే ఈ పరీక్షలు చేయనున్నారు. తాజాగా చైనాలో వైరస్ వ్యాప్తిపై బ్లూమ్‌బెర్గ్ వెల్లడించిన నివేదిక ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలో డిసెంబర్ 20నాటికి మొత్తం జనాభాలో 18శాతం లేదా.. 248 మిలియన్ల మంది వైరస్ బారిన పడి ఉండవచ్చని అంచనా వేసింది. ఈనేపథ్యంలోనే భారత్‌కు కూడా దేశంలో నాలుగో వేవ్‌కు అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకొని.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

    టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకాపై దృష్టి

    పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని.. టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకాపై దృష్టి సారించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చుని, మాస్కులు ధరించడం, శానిటైజేషన్‌, సామాజిక దూరాన్ని పాటించడం లాంటి కరోనా నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించి.. కీలక సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు చెప్పారు. మహమ్మారి నివారణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుందని రాష్ట్రాలకు భరోసా ఇచ్చారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులను సిద్ధం చేసేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కోవిడ్
    భారతదేశం

    తాజా

    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు సినిమా
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్
    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత సినిమా
    'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక భారతదేశం

    కోవిడ్

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన భారతదేశం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు ఇజ్రాయెల్

    భారతదేశం

    మార్చి 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం జపాన్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023