NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దగ్గుమందుతో కామెరూన్‌ లో చిన్నారుల మృతి.. మరోసారి భారత్‌పైనే అనుమానాలు
    తదుపరి వార్తా కథనం
    దగ్గుమందుతో కామెరూన్‌ లో చిన్నారుల మృతి.. మరోసారి భారత్‌పైనే అనుమానాలు
    దగ్గుమందుతో కామెరూన్‌ లో చిన్నారుల మృతి.. మరోసారి భారత్‌పైనే అనుమానాలు

    దగ్గుమందుతో కామెరూన్‌ లో చిన్నారుల మృతి.. మరోసారి భారత్‌పైనే అనుమానాలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 20, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాఫ్ సిరప్ కల్తీ కారణంగా చిన్నారులు మృతి చెందిన హృదయవిదారక ఘటన కామెరూన్ లో జరిగింది. ప్రాణాంతకరంగా మారిన సదరు ఔషధం భారత్‌లోనే తయారైందనే అనుమానాలకు తావిస్తోంది.

    సెంట్రల్ ఆఫ్రికన్ దేశం కామెరూన్‌ లో గత కొంత కాలంగా చిన్నారులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీరి మరణాలకు దగ్గుమందే కారణమని ఆ దేశ వైద్యాధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.

    నేచర్‌ కోల్డ్‌ దగ్గుమందు తయారీ లైసెన్స్‌ నంబర్, భారత్‌కు చెందిన ఓ సంస్థతో మ్యాచ్ అయిందని సమాచారం. కామెరూన్‌ దేశంలో గత కొన్ని రోజలుగా చిన్నారుల మరణాలు ఎక్కువయ్యాయి.

    దాదాపుగా 12 మంది ప్రాణాలు కోల్పోవడంపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ క్రమంలో సిరప్ ఫొటోలను అక్కడి అధికారులు రిలీజ్ చేశారు.

    DETAILS

    తాము ఎగుమతి చేసిన ఔషధాలెక్కడా కల్తీ కాలేదు: నవీన్ భాటియా

    నేచర్‌కోల్డ్‌ మందు డబ్బాలపై తయారీదారుడి పేరు రాయలేదు. కేవలం తయారీ లైసెన్స్‌ నంబర్ మాత్రమే ముద్రించగా, అది భారత్‌కు చెందిన సంస్థగా భావిస్తున్నారు.

    మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరానికి చెందిన రీమన్‌ ల్యాబ్స్‌కూ సేమ్ లైసెన్స్ ఉన్న విషయాన్ని ఓ ఆంగ్ల మీడియా కథనం వెలువరించింది.

    ఈ నేపథ్యంలోనే ఈ ఔషధం భారత్‌లోనే తయారైందని అనుమానిస్తున్నారు. అది తమ సంస్థ తయారు చేసిన ఔషధం లాగే ఉందని రీమన్‌ డైరెక్టర్‌ నవీన్‌ భాటియా వెల్లడించారు.

    అయితే, ప్రపంచంలో చాలా రకాల మందులకు నకిలీలున్నాయని, తాము ఎగుమతి చేసిన ఔషధాలెక్కడా కల్తీ కాలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగుమతి చేసే దగ్గు మందులకు ప్రభుత్వ ల్యాబ్‌ అనుమతిని గతంలోనే కేంద్రం తప్పనిసరి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    భారతదేశం

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    భారతదేశం

    సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి కాంగ్రెస్
    ప్రజారోగ్యానికి హాని కలగొచ్చు.. అందుకే ఈ కాంబో ఔషధాలు బ్యాన్ : కేంద్రం కేంద్రమంత్రి
    ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది రైలు ప్రమాదం
    ప్రపంచాన్ని భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025