NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య  
    తదుపరి వార్తా కథనం
    శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య  
    శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య

    శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 05, 2023
    11:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక మహిళ,ఆమె ప్రేమికుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతో వ్యక్తి భార్య,అత్తమామలు వారికి పాక్షికంగా గుండుకొట్టించి ఊరేగించినట్లు పోలీసులు తెలిపారు.

    హస్నాబాద్‌కు చెందిన షబానా(32)అనే మహిళతో తన భర్త హుస్సేన్ కు(30)వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానించిన భార్య నజియా,ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వారిని పట్టుకొని కట్టేయడమే కాకుండా పాక్షికంగా గుండు కొట్టించి గ్రామ వీధుల్లో ఊరేగించారు.

    అనంతరం,వారిని కట్టేసి ఆటో రిక్షాలో పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతుండగా హుస్సేన్ తప్పించుకొని పారిపోయాడు.

    హుస్సేన్‌కి షబానాతో వివాహేతర సంబంధం ఉందని,ఈ కారణంగానే హుస్సేన్ భార్య షబానా నివాసం ఉంటున్న ప్రదేశానికి వెళ్లి వారిద్దరినీ పట్టుకొని గుండు కొట్టించిందని పోలీసులు తెలిపారు.

    Details 

    గుండు కొట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ 

    హుస్సేన్,షబానాకు గుండు కొడుతున్నపుడు నజియా కుటుంబసభ్యులు ఆ దృశ్యాలను చిత్రీకరించినట్లు హిందూపూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి పి కంజాక్షన్ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు.

    హుస్సేన్‌, షబానాకు పాక్షికంగా గుండు కొట్టించిన వీడియోను నజియా కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

    నజియా, ఆమె కుటుంబ సభ్యులపై 506(నేరపూరిత బెదిరింపు), 355(ఒక వ్యక్తిని అగౌరవపరిచేలా దాడి చేయడం లేదా బలవంతం చేయడం),323 (స్వచ్ఛందంగా గాయపరచడం)లాంటి వివిధ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ప్రక్రియలో పోలీసులు ఉన్నారు.

    కాగా, రెండేళ్ల క్రితమే నజియా భర్త నుంచి విడిపోయినట్టు పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీ సత్యసాయి జిల్లా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    శ్రీ సత్యసాయి జిల్లా

    ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    పాకిస్థాన్ మహిళ 'హనీట్రాప్'లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్  విశాఖపట్టణం
    ఈనెల 10 నుంచి వారాహి యాత్ర.. మూడో విడత కోసం కమిటీల నియామకం పవన్ కళ్యాణ్
    ఒకే ఫోటోతో 658 సిమ్‌కార్డులు జారీ.. దర్యాప్తునకు కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు విజయవాడ సెంట్రల్
    పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన విశాఖపట్టణం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025