NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేలా ఆదేశాలంటూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు  
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేలా ఆదేశాలంటూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు  
    ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేలా ఆదేశాలంటూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు

    Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేలా ఆదేశాలంటూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 24, 2025
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఒకదానికొకటి సవాలు విసురుకుంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

    విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఎత్తుగడలతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

    ఒక పార్టీ మరో పార్టీపై విమర్శలు చేస్తూ ప్రతిఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.

    ఈ క్రమంలో, ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది.

    శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

    కాగ్ నివేదికలను సమర్పించేందుకు ప్రత్యేక శాసనసభ సమావేశం నిర్వహించాలన్న పిటిషన్‌పై స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయడానికి హైకోర్టు శుక్రవారం నిరాకరించింది.

    వివరాలు 

    ఆప్,కాంగ్రెస్,బీజేపీ మధ్య త్రిముఖ పోటీ

    అయితే,కాగ్ నివేదిక సమర్పణలో సీఎం అతిషి నేతృత్వంలోని ప్రభుత్వం ఆలస్యం చేసిన విషయాన్ని ధర్మాసనం ఎత్తి చూపింది.

    ఇటీవల కాగ్ నివేదిక లీక్ అయ్యిందంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది.ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన లిక్కర్ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం జరిగిందని బీజేపీ ఆరోపించింది.

    ఈ ఆరోపణలపై ఆప్ నేతలు తీవ్రంగా స్పందిస్తూ బీజేపీ విమర్శలను ఖండించారు.

    ఇదిలా ఉంటే,ఎన్నికల ప్రచారం ప్రస్తుతం ఢిల్లీలో ఉధృతంగా కొనసాగుతోంది.

    ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించబడుతుండగా,ఫలితాలు ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి.

    ఆప్,కాంగ్రెస్,బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది.మరోసారి అధికారంలోకి రావాలని ఆప్ ప్రయత్నిస్తుండగా,బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని కృషి చేస్తోంది.

    ఈసారి ఓటర్లు ఏ పార్టీకి అధికారం అప్పగిస్తారన్నది ఉత్కంఠగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    దిల్లీ

    Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు ..హెచ్చరికలు జారీ వాయు కాలుష్యం
    Delhi: ఢిల్లీ నగరంలో ఏడాది పొడవునా బాణాసంచా నిషేధం  భారతదేశం
    Delhi: ఢిల్లీలో పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపు.. డిసెంబర్‌లో నాల్గవ కేసు బాంబు బెదిరింపు
    Delhi: ఢిల్లీ బీజేపీ ఆఫీస్ దగ్గర అనుమానిత బ్యాగ్ కలకలం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025