NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kerala: కేరళలో సీపీఎం నేత హత్య కేసు.. 9 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కోర్టు జీవిత ఖైదు
    తదుపరి వార్తా కథనం
    Kerala: కేరళలో సీపీఎం నేత హత్య కేసు.. 9 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కోర్టు జీవిత ఖైదు
    కేరళలో సీపీఎం నేత హత్య కేసు.. 9 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కోర్టు జీవిత ఖైదు

    Kerala: కేరళలో సీపీఎం నేత హత్య కేసు.. 9 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కోర్టు జీవిత ఖైదు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 07, 2025
    05:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2005లో కేరళలో సంచలనం సృష్టించిన సీపీఎం కార్యకర్త రిజిత్ శంకరన్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

    19 ఏళ్ల క్రితం కన్నూర్ జిల్లాలో జరిగిన ఈ హత్యకేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు తలస్సేరి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.

    25 ఏళ్ల రిజిత్‌ను 2005 అక్టోబర్ 3న కన్నాపురం చుండాలోని ఓ దేవాలయం సమీపంలో దాడి చేసి హత్య చేశారు.

    రాజకీయంగా అస్థిరతతో నిండిన కన్నూర్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్, సీపీఎంల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల సమయంలో ఈ దారుణం జరిగింది.

    రిజిత్ తన స్నేహితులతో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆయుధాలతో ఆర్ఎస్ఎస్ బృందం అతనిపై దాడికి పాల్పడింది.

    Details

    ప్రాణాలు కోల్పోయిన రిజిత్

    ఈ దాడిలో రిజిత్ ప్రాణాలు కోల్పోగా, అతని ముగ్గురు స్నేహితులు గాయపడ్డారు. జనవరి 4న కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించి శిక్ష విధించింది.

    మొత్తం 10 మందిపై అభియోగాలు మోపగా, విచారణ సమయంలో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించారు.

    శిక్ష పడిన 9 మంది నిందితులు సుధాకరన్ (57), జయేష్ (41), రంజిత్ (44), అజీంద్రన్ (51), అనిల్‌కుమార్ (52), రాజేష్ (46), శ్రీకాంత్ (47), అతని సోదరుడు శ్రీజిత్ (43), భాస్కరన్ (67)గా గుర్తించారు.

    హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద వారిని దోషులుగా తేల్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    ఆర్ఎస్ఎస్

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    కేరళ

    Kerala: కేరళలో రుతుపవనాలు తీవ్రతరం.. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ నైరుతి రుతుపవనాలు
    Brain-eating amoeba: కేరళలో నాల్గవ చిన్నారికి అరుదైన మెదడు తినే అమీబా ఇన్ఫెక్షన్ నిర్ధారణ  భారతదేశం
    Kerala: ఆసుపత్రి లిఫ్ట్‌లో ఒకటిన్నర రోజు ఇరుకుపోయిన రోగి .. ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్  తిరువనంతపురం
    Kerala: కేరళలో నిఫా వైరస్‌తో 14 ఏళ్ల చిన్నారి మృతి  భారతదేశం

    ఆర్ఎస్ఎస్

    RSS : మ‌ణిపూర్ హింస‌కు వాళ్లే కార‌ణమన్న మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. మీడియాను గుప్పెట పట్టారని ఫైర్ మోహన్ భగవత్
    Indresh Kumar : అహంకారులను రాముడు 241 వద్ద ఆపాడు.. బీజేపీపై ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ విమర్శలు భారతదేశం
    Indresh Kumar: ఇంద్రేశ్‌ కుమార్‌ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ దిద్దు బాటు చర్యలు భారతదేశం
    RSS: 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గోవడంపై నిషేధం ఎత్తివేత.. మండిపడిన కాంగ్రెస్  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025