NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Secretariat: ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్లు.. రూ.4,688 కోట్ల అంచనాతో బిడ్ల ఆహ్వానం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Secretariat: ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్లు.. రూ.4,688 కోట్ల అంచనాతో బిడ్ల ఆహ్వానం
    ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్లు

    AP Secretariat: ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్లు.. రూ.4,688 కోట్ల అంచనాతో బిడ్ల ఆహ్వానం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 17, 2025
    08:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్ర పరిపాలన కేంద్రంగా మారబోయే ఐకానిక్‌ టవర్ల నిర్మాణం కోసం అమరావతిలో చర్యలు వేగంగా జరుగుతున్నాయి.

    ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ఈ టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను తాజాగా పిలిచింది.

    ఈ భవన సముదాయంలో సమీకృత రాష్ట్ర సచివాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్ని స్థాపించనున్నారు.

    గతంలో పథకం వేసినట్లే ఈసారి కూడా మొత్తం ఐదు టవర్లను మూడు విభిన్న ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ చేపట్టారు.

    వివరాలు 

    పాత టెండర్లతో పోల్చితే వ్యయం భారీగా పెరిగింది 

    ఈ భారీ ప్రాజెక్ట్‌కు మొత్తం రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయం ఉంది.

    ఇటీవలే నాన్‌-ఎస్‌ఓఆర్‌ రేట్లను ఖరారు చేయడంతో టెండర్ ప్రక్రియకు మార్గం సుగమం అయింది.

    అభ్యర్థులు వచ్చే నెల 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు తమ బిడ్లను సమర్పించవచ్చు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్లను తెరిచి పరిశీలించనున్నారు.

    ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి రూ.2,703 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు.

    అయితే, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని అవలంబించిన నేపథ్యంలో ఇది జాప్యం అవ్వడంతో, ప్రస్తుత అంచనా వ్యయం దాదాపు 73 శాతం పెరిగింది.

    వివరాలు 

    మూడు ప్యాకేజీలుగా భవనాల నిర్మాణం 

    ప్రస్తుతం మూడు ప్యాకేజీలుగా భవనాల నిర్మాణాన్ని విభజించారు:

    మొదటి ప్యాకేజీ: రూ.1,126.51 కోట్ల వ్యయంతో జీఏడీ టవర్‌ నిర్మాణం

    రెండవ ప్యాకేజీ: రూ.1,897.86 కోట్లతో టవర్‌ 1, టవర్‌ 2 నిర్మాణం

    మూడవ ప్యాకేజీ: రూ.1,664.45 కోట్లతో టవర్‌ 3, టవర్‌ 4 నిర్మాణం

    వివరాలు 

    డయాగ్రిడ్‌ పద్ధతిలో ఆకర్షణీయ నిర్మాణం 

    ఈ టవర్ల నిర్మాణానికి ఫోస్టర్స్‌ సంస్థ ఆధునిక డయాగ్రిడ్‌ విధానంలో డిజైన్‌ను రూపొందించింది.

    ఈ విధానం భవనాలను బలంగా, దీర్ఘకాలికంగా నిలిపేలా చేస్తుంది. ఈ ఐదు టవర్లలో జీఏడీ టవర్‌ అత్యంత ఎత్తైనది కానుంది.

    ఇది బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు 47 అంతస్తులతో నిర్మించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఏర్పాటు కానుంది.

    పైభాగంలో సీఎం ప్రయాణాల కోసం ప్రత్యేక హెలిప్యాడ్‌ను నిర్మించనున్నారు.

    మిగిలిన నాలుగు హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్స్‌ (HOD) టవర్లను ఒక్కొక్కటిగా 39 అంతస్తులతో నిర్మించనున్నారు.

    ఐకానిక్‌ టవర్ల మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారుగా 68.88 లక్షల చదరపు అడుగులు.

    వివరాలు 

    నిర్మాణానికి భారీగా స్టీల్‌ అవసరం 

    ఈ డిజైన్‌కు అనుగుణంగా నిర్మాణం కోసం సుమారుగా 60 వేల టన్నుల స్టీల్‌ అవసరమవుతుంది.

    ఈ అవసరాన్ని తీర్చేందుకు సీఆర్‌డీఏ అధికారులు ఇప్పటికే రాయగడలో ఉన్న ఉక్కు పరిశ్రమను సందర్శించారు.

    అలాగే కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ఉన్న జిందాల్‌ సంస్థను, తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ఎవర్‌ సెండే కంపెనీకి చెందిన వర్క్‌షాపులను పరిశీలించారు.

    ఈ ప్రాజెక్ట్ కోసం స్టీల్‌ను రాయగడలో కొనుగోలు చేసి, బళ్లారి మరియు తిరుచిలో ఫ్యాబ్రికేట్‌ చేయాలని నిర్ణయించారు.

    ఆ తర్వాత ఫ్యాబ్రికేషన్‌ పూర్తయిన స్టీల్‌ను అమరావతికి తీసుకువచ్చి నిర్మాణంలో వినియోగించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    అమరావతి

    Amaravathi: రాజధానిలో మరో రూ. 24,276 కోట్ల పనులకు ఆమోదం.. 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం చంద్రబాబు నాయుడు
    Amaravati: పైప్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా.. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీ తరహా ప్రాజెక్టుకు ఐవోసీ ప్రతిపాదన భారతదేశం
    Andhra Pradesh: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మూడేళ్లలో పూర్తి.. పనులకు రూ.45 వేల కోట్లతో టెండర్లు భారతదేశం
    Kridaapp: అమరావతి కేంద్రంగా 2027లో జాతీయ స్థాయి క్రీడలు: రాంప్రసాద్‌రెడ్డి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025