LOADING...
Cyber ​​attacks: ఐదు రాష్ట్రాల్లో సైబర్ దాడులు.. 81 మంది అరెస్టు.. కోట్ల రూపాయల నిధులు ఫ్రీజ్!
ఐదు రాష్ట్రాల్లో సైబర్ దాడులు.. 81 మంది అరెస్టు.. కోట్ల రూపాయల నిధులు ఫ్రీజ్!

Cyber ​​attacks: ఐదు రాష్ట్రాల్లో సైబర్ దాడులు.. 81 మంది అరెస్టు.. కోట్ల రూపాయల నిధులు ఫ్రీజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌ చేపట్టి దేశవ్యాప్తంగా సైబర్‌ నేరగాళ్లను బంధించింది. ఏకకాలంలో ఐదు రాష్ట్రాల్లో చేసిన దాడుల్లో మొత్తం 81 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్‌ సాగిందని అధికారులు వెల్లడించారు. అరెస్టయిన నిందితులపై దేశవ్యాప్తంగా 754 సైబర్‌ కేసులు నమోదైనట్లు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. వీరంతా కలసి సుమారు రూ.95 కోట్ల విలువైన మోసాలకు పాల్పడ్డారని విచారణలో తేలింది.

Details

నిందితులలో 17 మంది ఏజెంట్లు

నిందితులలో 17 మంది ఏజెంట్లు, ఏడుగురు మహిళలు, అలాగే 58 మంది మ్యూల్‌ అకౌంట్‌ హోల్డర్లు ఉన్నారని అధికారులు వివరించారు. వీరి వద్ద నుంచి 84 మొబైల్‌ ఫోన్లు, 101 సిమ్‌ కార్డులు, 89 బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదనంగా నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. కోట్ల రూపాయల నిధులను ఫ్రీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ మొత్తం సొమ్మును త్వరలోనే బాధితులకు తిరిగి అందజేయడానికి సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో చర్యలు ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ ద్వారా సైబర్‌ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసులకు మరో విజయాన్ని అందించిందని అధికారులు పేర్కొన్నారు.