NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్‌ ..
    తదుపరి వార్తా కథనం
    Telangana: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్‌ ..
    రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్‌ ..

    Telangana: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్‌ ..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 08, 2024
    09:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.

    రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే పేరుతో కొందరు సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ అధికారులు సూచించారు.

    సర్వే పేరుతో ఎవరైనా సైబర్‌ నేరగాళ్లు OTP అడిగినా ఇస్తే, అది మోసంగా మారే అవకాశం ఉంది.

    ప్రజలు ఇటువంటి వాటి నుండి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సర్వే పేరు చెప్పి లింకులు పంపి క్లిక్ చేయమని చెప్పినా వాటిని క్లిక్ చేయొద్దని సలహా ఇచ్చారు.

    సర్వే ప్రక్రియ కోసం ప్రభుత్వం నియమించిన అధికారులే ఇంటికి వచ్చి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు.

    వివరాలు 

     సైబర్‌ క్రైమ్‌ నెంబర్‌ 1930కు కాల్ 

    ప్రభుత్వం 94,750 మంది ఎన్యూమరేటర్లు, 9,478 మంది సూపర్‌వైజర్లను సర్వే కోసం నియమించిందని పేర్కొన్నారు.

    ఎలాంటి అనుమానం వచ్చినా సైబర్‌ క్రైమ్‌ నెంబర్‌ 1930కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.

    ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్ల వలలో అధికంగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారే పడుతున్నారు.

    కొందరు కష్టపడి సంపాదించిన డబ్బులను మోసం ద్వారా పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లోకి చొరబడి చోరీ చేయడం కంటే, సిస్టమ్‌ ముందు కూర్చుని మోసాలు చేసే కొత్త రకమైన నేరగాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు.

    ఇటువంటి సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    Telangana: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన ఆంధ్రప్రదేశ్
    ATC: రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్‌ ఏటీసీ.. కందుకూరులో ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి భారతదేశం
    Foxconn: ఫాక్స్‌కాన్‌కు మరో 60 ఎకరాల భూమి కేటాయింపు.. వచ్చే నెలలోనే ఉత్పత్తుల ప్రారంభం రేవంత్ రెడ్డి
    AP TG Roads: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్.. రాష్ట్ర ర‌హ‌దారుల అభివృద్ధికి నిధులు మంజూరు  నితిన్ గడ్కరీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025