NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dasara Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు..
    తదుపరి వార్తా కథనం
    Dasara Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు..
    ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు..

    Dasara Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 04, 2024
    11:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దసరా పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి.

    ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లలో నిలబడేందుకు కూడా స్థలం దొరక్క, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

    ఈ పరిస్థితిని గమనించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ అప్రమత్తమై, ప్రయాణికుల సౌకర్యం కోసం పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది.

    బతుకమ్మ,దసరా పండుగలను పురస్కరించుకొని, ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

    వివరాలు 

    170 ప్రత్యేక రైళ్లు

    ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్‌నగర్, తిరుపతి వంటి ప్రధాన స్టేషన్ల నుంచి వివిధ ముఖ్యమైన మార్గాల్లో నడవనున్నాయి.

    దక్షిణ మధ్య రైల్వే 170 ప్రత్యేక రైళ్లు నడపగా, ఇతర ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే మీదుగా 115 రైళ్లు నడవనున్నాయి.

    అదనంగా మరో 185 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు ప్రకటించారు.

    ప్రధాన రూట్లు

    సికింద్రాబాద్-కాకినాడ, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-నగర్ సోల్, సికింద్రాబాద్-మడ్లాటౌన్, హైదరాబాద్-గోరఖ్‌పూర్, మహబూబ్‌నగర్-గోరఖ్‌పూర్, సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-సంత్రాగచ్చి, తిరుపతి-మచిలీపట్నం, తిరుపతి-షిర్డీ, నాందేడ్-ఈరోడ్, జాల్నా-చాప్రా వంటి రూట్లలో ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు ధర్మవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025