NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం 
    తదుపరి వార్తా కథనం
    చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం 
    చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం

    చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం 

    వ్రాసిన వారు Stalin
    Sep 19, 2023
    11:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సెప్టెంబర్ 19వ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైన రోజు.

    75ఏళ్ల స్వాతంత్ర్య భారతావనికి సజీవ సాక్ష్యంగా నిలిచిన పాత పార్లమెంట్ భవనానికి తుది వీడ్కోలు పలికిన రోజు.. కొంగొత్త ఆశలతో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలుపాలనే దృఢ సంకల్పంతో కొత్త పార్లమెంట్ భవనంలోకి ఎంపీలు, కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి, రాజకీయ ప్రముఖులు అడుగుపెట్టిన రోజు.

    పార్లమెంటు ప్రత్యేక సమావేశాల రెండోరోజు సెషన్ ప్రారంభానికి ముందు కొత్త భవనాన్నిఅధికారికంగా భారత్ పార్లమెంట్‍‌గా నోటిఫై చేస్తూ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.

    రెండోరోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎంపీలు, రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖర్, స్పీకర్ ఓం బిర్లా పాత పార్లమెంట్ భవనంలో ఫొటో సెషన్ నిర్వహించి తుది వీడ్కోలు పలికారు.

    మోదీ

    కొత్త పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌లో ప్రముఖల ప్రసంగం

    ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్, స్పీకర్ ఓం బిర్లా నాయకత్వంలో ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.

    సెంట్రల్ హాల్‌లో సీనియర్ పార్లమెంటేరియన్లు ప్రసంగించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్వాగత ప్రసంగం చేస్తారు.

    లోక్‌సభలో సీనియర్ సభ్యురాలు, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ మొదటి స్పీకర్‌గా ఉంటారని పీటీఐ వర్గాలు తెలిపాయి.

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని ప్రసంగించాలని కేంద్రం ఆహ్వానం పంపింది. కానీ ఆయన అనారోగ్యం కారణంగా హాజరు కాకపోవచ్చునని తెలుస్తోంది.

    రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా మాట్లాడనున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేనకా గాంధీ ప్రసంగం

    #WATCH | Special Session of Parliament: BJP MP Maneka Gandhi says "This is a historic day today and I am proud to be a part of this historic moment. We are going to a New Building and hopefully, this grand edifice will reflect the aspirations of a new Bharat. Today, I have been… pic.twitter.com/sqoQEEDomb

    — ANI (@ANI) September 19, 2023

    మోదీ

    పార్లమెంట్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ 

    పార్లమెంట్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ నేటి నుంచి అమల్లోకి రానుంది. మార్షల్స్, భద్రతా సిబ్బంది, అధికారులు, ఛాంబర్ అటెండర్లు, డ్రైవర్లకు కొత్త యూనిఫాంలను అందజేశారు.

    దిల్లీ నడిబొడ్డున కర్తవ్య మార్గంలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది, రాజ్యసభలో 300 మంది సభ్యులు కూర్చునే అవకాశం ఉంది.

    ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 1,280 మంది ఎంపీలకు లోక్‌సభ ఛాంబర్‌లో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.

    నాలుగు అంతస్థుల్లో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. దీని నిర్మాణం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పేర్లు పెట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ కొత్త భవనం
    నరేంద్ర మోదీ
    లోక్‌సభ
    రాజ్యసభ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పార్లమెంట్ కొత్త భవనం

    కొత్త పార్లమెంట్‌లో టెక్నాలజీ మూములుగా ఉండదు.. సమయం దాటితే మైక్‌ కట్‌ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    నరేంద్ర మోదీ

    చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  జీ20 సదస్సు
    సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్‌హౌస్ వెల్లడి  జో బైడెన్
    సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి షణ్ముగరత్నం ఘన విజయం  సింగపూర్

    లోక్‌సభ

    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం నరేంద్ర మోదీ
    అట‌వీ సంర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు 2023కి లోక్‌స‌భ గ్రీన్ సిగ్నల్.. సఫారీల ఏర్పాటుకు ముందడుగు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు?  అవిశ్వాస తీర్మానం

    రాజ్యసభ

    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025