NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 17మంది కార్మికులు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Maharashtra: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 17మంది కార్మికులు మృతి 
    మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 16మంది కార్మికులు మృతి

    Maharashtra: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 17మంది కార్మికులు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Aug 01, 2023
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. షాపూర్ సమీపంలో గిర్డర్ మెషిన్ కుప్పకూలడంతో 17 మంది కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

    సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే మూడో దశ నిర్మాణంలో ఉందని షాపూర్ పోలీసులు తెలిపారు. వంతెన నిర్మాణంలో గిర్డర్ మెషిన్‌ను ఉపయోగించినట్లు వెల్లడించారు.

    కార్మికులు పనిలో నిమగ్నమైన సమయంలో గిర్డర్ యంత్రం 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది.

    మరికొంత మంది ఇప్పటికి గిర్డర్ యంత్రం కింద ఉన్నట్లు తెలుస్తోంది.

    మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రస్తుతం ఘటనా స్థలంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడిన వారిని గాయపడిన షాపూర్ తాలూకాలోని ఆసుపత్రిలో చేర్పించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సహాయక చర్యల దృశ్యాలు

    #WATCH | Maharashtra: A total of 16 bodies have been recovered so far and three injured reported. Rescue and search operation underway: NDRF pic.twitter.com/nliOMW9pv6

    — ANI (@ANI) August 1, 2023

    మహారాష్ట్ర

    మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ

    మృతి చెందిన వారిలో ఐదుగురు సైట్ ఇంజనీర్లు, 11మంది కార్మికులు, మరో ఇద్దరు బయటి వ్యక్తులుగా అధికారులు చెబుతున్నారు.

    మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం షాహాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఆరుగురు కార్మికులు యంత్రం కింద చిక్కుకొని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

    మరోవైపు మహారాష్ట్ర మంత్రి దాదా భూసే ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు.

    ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాను కూడా ప్రధాని మోదీ ప్రకటించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

    शहापूर तालुक्यात समृद्धी महामार्गावर पुलाचे काम सुरू असताना एक दुर्घटना होऊन काही मजुरांचा मृत्यू झाल्याची घटना अतिशय दुःखद आणि मनाला वेदना देणारी आहे. मी त्यांना भावपूर्ण श्रद्धांजली अर्पण करतो. त्यांच्या कुटुंबियांच्या दुःखात आम्ही सहभागी आहोत.
    या घटनेत 3 कामगार जखमी झाले.…

    — Devendra Fadnavis (@Dev_Fadnavis) August 1, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని మోదీ ట్వీట్

    Pained by the tragic mishap in Shahapur, Maharashtra. My deepest condolences to the families of those who lost their lives. Our thoughts and prayers are with those who are injured. NDRF and local administration are working at the site of the mishap and all possible measures are…

    — PMO India (@PMOIndia) August 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    తాజా వార్తలు

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    మహారాష్ట్ర

    జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు సుప్రీంకోర్టు
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం  ముంబై
    ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్  కొల్లాపూర్

    తాజా వార్తలు

    No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు?  అవిశ్వాస తీర్మానం
    Telangana Floods: వరదల్లో చిక్కుకున్న 80మంది పర్యాటకులు, రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది  తెలంగాణ
    ఆఫ్రికా దేశం నైజర్‌లో తిరుగుబాటు: అధ్యక్షుడిని తొలగించిన సైన్యం నైజర్
    దిల్లీల్లో మరికొన్ని రోజులు వర్షాలు; మళ్లీ ప్రమాద స్థాయికి యమునా నది దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025