Page Loader
Uttarkhand: ఉత్తరాఖండ్‌లో కోల్‌కతా తరహా ఘటన.. నర్స్ తల పగలగొట్టి అత్యాచారం,హత్య.. నిందితుడి అరెస్ట్
నర్స్ తల పగలగొట్టి అత్యాచారం,హత్య.. నిందితుడి అరెస్ట్

Uttarkhand: ఉత్తరాఖండ్‌లో కోల్‌కతా తరహా ఘటన.. నర్స్ తల పగలగొట్టి అత్యాచారం,హత్య.. నిందితుడి అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 16, 2024
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లో కోల్‌కతా తరహా ఘటనను పోలీసులు వెల్లడించారు. ఓ క్రూరమైన వ్యక్తి మొదట నర్సుపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు.అనంతరం సామాన్లు దోచుకుని పారిపోయాడు. జూలై 30 నుంచి నర్సు కనిపించకుండా పోయింది.అతని సోదరి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌కు చెందిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతన్ని జైలుకు పంపారు. ఛిద్రమైన మహిళ మృతదేహం ఆగస్టు 8న లభ్యమైంది. రుద్రాపూర్‌లోని బిలాస్‌పూర్‌ కాలనీలోని పొదల్లో మృతదేహం లభ్యమైంది. అత్యాచారం తర్వాత హత్య జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. 33 ఏళ్ల మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి ఓ అద్దె గదిలో ఉంటోంది. జులె 30న డ్యూటీకి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది

వివరాలు 

రుద్రాపుర్‌ పోలీసులకు సోదరి  ఫిర్యాదు 

ఆందోళనకు గురైన బాధితురాలి సోదరి రుద్రాపుర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చుట్టుపక్కల ఉన్న కెమెరాలను శోధించారు. నర్సు ఫోన్ IEMI నంబర్‌పై నిఘా పెట్టారు. ఫుటేజీలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మహిళను వెంబడిస్తున్నట్లు కనిపించింది. దీని తర్వాత UPలోని బరేలీలో ఫోన్ యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్ పోలీసులు అక్కడికి చేరుకోగా.. దానిని ఖుష్బూ అనే మహిళ వాడుతున్నట్లు గుర్తించారు. ఆమె తుర్సపట్టి నివాసి ధర్మేంద్ర భార్య. విచారణలో, తన భర్త ఈ ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడని మహిళ చెప్పింది. అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాలు 

గుర్తింపును దాచేందుకు రాయితో ముఖం చితకబాదారు 

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ధర్మేంద్ర లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు. పోలీసులు అతడిని పట్టుకుని డెహ్రాడూన్‌కు తీసుకొచ్చారు. జాఫర్‌పూర్‌లోని ఫ్యాక్టరీలో ఆరు నెలలుగా పనిచేస్తున్నట్లు ధర్మేంద్ర తెలిపాడు. జులై 30న ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరిన బాధితురాలిని అనుసరించిన నిందితుడు.. ఆమె అపార్ట్‌మెంట్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. మహిళ కేకలు వేయడంతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె ముఖాన్నిరాయితో చితకబాది, సామాన్లు, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. తర్వాత బరేలీకి వెళ్లి సిమ్ వేసి ఫోన్ స్విచ్ ఆన్ చేసినట్లు తెలిపాడు. నిందితుడిని జైలుకు తరలించినట్లు ఎస్‌ఎస్పీ మంజునాథ్‌ టిసి తెలిపారు.