NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  PM Modi: ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ 
    తదుపరి వార్తా కథనం
     PM Modi: ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ 
    ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ

     PM Modi: ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    02:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.

    ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల కోసం వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది.

    తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఉగ్రదాడి అనంతరం భద్రతా వ్యవహారాలపై కేంద్ర క్యాబినెట్ కమిటీ (CCS) అత్యవసర భేటీ నిర్వహించింది.

    ఈ సమావేశంలో ఉగ్రవాదులపై తక్షణ చర్యలకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను కల్పించారు.

    లక్ష్యాలను ఎప్పుడు ఎలా దాడి చేయాలన్నదానిపై తామే నిర్ణయం తీసుకోవచ్చని సీసీఎస్ స్పష్టం చేసింది.

    ఇదే సమయంలో,సైనిక సన్నద్ధతలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వాయుసేన యుద్ధవిమానాల ల్యాండింగ్‌,టేకాఫ్ విన్యాసాలు నిర్వహించడంతో స్పందన స్పష్టమైంది.

    వివరాలు 

    రక్షణశాఖ కార్యదర్శి భేటీకి మరింత ప్రాధాన్యత

    ఆ తరువాత భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, వాయుసేన చీఫ్‌ అమర్‌ప్రీత్ సింగ్‌లు వరుసగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

    ఈ పరిణామాల మధ్య రక్షణశాఖ కార్యదర్శి భేటీకి వచ్చారు,ఇది మరింత ప్రాధాన్యతను పొందింది.

    ఇదిలా ఉండగా, భారత్ ఇప్పటివరకు పహల్గాం దాడికి ప్రత్యక్షంగా సైనిక ప్రతిస్పందన ఇవ్వకపోయినా, పాకిస్తాన్‌ను వ్యూహాత్మకంగా ఒత్తిడికి గురిచేస్తోంది.

    ఇప్పటికే సింధు జలాలపై ఒప్పందాన్ని పాటించకుండానే భారత్‌ వాటి ప్రవాహాన్ని నియంత్రిస్తూ పాకిస్తాన్‌ను కఠిన పరిస్థితిలోకి నెట్టింది.

    తాజాగా బగలిహార్‌ జలాశయం నుండి నీటి సరఫరాను నిలిపివేయడం వల్ల పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో సాగునీరు అందక చాలా ప్రదేశాలు దెబ్బతిన్నాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఇది స్పష్టమైంది.

    వివరాలు 

    కిషన్‌గంగ జలాశయం నుండి కూడా నీరు వెళ్లకుండా యోచన 

    జీలం నదిపై ఉన్న కిషన్‌గంగ జలాశయం నుండి కూడా నీటిని పాకిస్తాన్‌కు వెళ్లకుండా అడ్డుకునే దిశగా కేంద్రం యోచిస్తోంది.

    అంతేకాకుండా కశ్మీర్‌లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించడంతో పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం

    నరేంద్ర మోదీ

    PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  భారతదేశం
    Waqf Amendment Bill: వక్ఫ్‌ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడంపై ప్రధాని మోదీ హర్షం  భారతదేశం
    PM Modi: ఈశాన్య వ్యాఖ్యల వివాదం.. బంగ్లాదేశ్‌ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో మోదీ భేటీ  అంతర్జాతీయం
    PM Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు ప్రదానం శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025