NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Pollution: దిల్లీలో బాగా త‌గ్గిన గాలి నాణ్య‌త.. 400 దాటిన ఏక్యూఐ
    తదుపరి వార్తా కథనం
    Delhi Pollution: దిల్లీలో బాగా త‌గ్గిన గాలి నాణ్య‌త.. 400 దాటిన ఏక్యూఐ
    దిల్లీలో బాగా త‌గ్గిన గాలి నాణ్య‌త.. 400 దాటిన ఏక్యూఐ

    Delhi Pollution: దిల్లీలో బాగా త‌గ్గిన గాలి నాణ్య‌త.. 400 దాటిన ఏక్యూఐ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 13, 2024
    08:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశరాజధాని దిల్లీపై దట్టమైన పొగమంచు వదలకుండా ఉంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.

    ఈరోజు (బుధవారం) ఉదయం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 339గా నమోదైంది.

    చలి వాతావరణం కూడా ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది.

    ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పొగమంచు కారణంగా దృష్టిపాతం తగ్గి ప్రయాణాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

    వివరాలు 

    అత్యంత ప్రమాదకర స్థాయిలో కాలుష్యం

    దిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత మరింతగా దిగజారుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) ప్రకారం, బుధవారం కూడా దిల్లీలో గాలి నాణ్యత 'చాలా పేలవమైన' స్థాయిలోనే ఉంది.

    గాలి నాణ్యత 301 నుండి 400 మధ్య ఉన్నప్పుడు ప్రజలు శ్వాసకోశ సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

    అలాగే AQI 401 నుండి 500 మధ్య ఉన్నప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో కాలుష్యం ఉన్నట్లుగా పరిగణించబడుతుంది, ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

    ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మరింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

    వివరాలు 

    సచివాలయంలో నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు హీటర్లు 

    CPCB వివరాల ప్రకారం, మంగళవారం ఉదయం 7:30 గంటలకు ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక 355గా నమోదయింది, ఇది కూడా అత్యంత ప్రమాదకర స్థాయిలోనే ఉంది.

    సోమవారం ఈ AQI 347గా నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్, ఢిల్లీ సచివాలయంలో నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు హీటర్లను పంపిణీ చేశారు.

    చలి సమయంలో మంటలు వేయడం వల్ల కాలుష్యం పెరిగే ప్రమాదం ఉన్నందున, హీటర్ల పంపిణీ ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోందని మంత్రి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    దిల్లీ

    Air Quality: పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎయిర్‌ క్వాలిటీ కమిషన్‌పై సుప్రీం ఆగ్రహం సుప్రీంకోర్టు
    Delhi Tragedy: నలుగురు దివ్యాంగ కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య ఇండియా
    Prakash Karat: సీతారాం ఏచూరి స్థానంలో ప్రకాష్ కరత్.. నూతన ప్రధాన కార్యదర్శిగా నియామకం  ఇండియా
    Ajit Doval France Visit: ఫ్రాన్స్‌లో అజిత్ దోవల్ పర్యటన.. రాఫెల్ డీల్‌పై కీలక చర్చలు ఫ్రాన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025