NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air Pollution: దీపావళికి ముందు మెరుగుపడిన ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ.. అయినా ప్రమాదకరంగానే ఏక్యూఐ 
    తదుపరి వార్తా కథనం
    Air Pollution: దీపావళికి ముందు మెరుగుపడిన ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ.. అయినా ప్రమాదకరంగానే ఏక్యూఐ 
    దీపావళికి ముందు మెరుగుపడిన ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ

    Air Pollution: దీపావళికి ముందు మెరుగుపడిన ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ.. అయినా ప్రమాదకరంగానే ఏక్యూఐ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 29, 2024
    01:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో వరుసగా ఆరు రోజుల తర్వాత మంగళవారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) కాస్త మెరుగుపడింది.

    అయినప్పటికీ, వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (Central Pollution Control Board) ప్రకారం మంగళవారం ఉదయం 9 గంటలకు దిల్లీలో ఏక్యూఐ 272గా నమోదైంది.

    ముందుగా అధిక కాలుష్యస్థాయి ముండకా ప్రాంతంలో 327 AQIతో అధ్వాన స్థితికి చేరిందని సీపీసీబీ వెల్లడించింది.

    అంతేకాక,ఆనంద్‌ విహార్‌ 318,అయా నగర్‌ 313, వజీర్‌పూర్‌ 307,పట్‌పర్‌ గంజ్‌ 296,ఆర్కేపురం 295, రోహిణి 287,ఓఖ్లా ఫేజ్‌-2 265, ఐటీవో 261, లోధీ రోడ్‌ 255, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ 247, అరబిందో మార్గ్‌ 240 AQIతో నమోదైనట్లు తెలిపింది.

    వివరాలు 

    దిల్లీలో వాయు కాలుష్యం భయంకర స్థాయికి.. 

    గాలి నాణ్యతను ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ సంస్థ అంచనా వేసింది.

    దాని ప్రకారం, AQI 447కు చేరినపుడు దాన్ని తీవ్రమైన వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు.

    AQI 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత సర్వసాధారణంగా ఉంటుందని, 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత సగటు స్థాయిలో ఉందని అర్థం. AQI 200-300 మధ్య ఉంటే అధ్వానంగా, 300-400 మధ్య ఉంటే మరింత అధ్వానంగా, 400-500 మధ్య ఉంటే వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా పరిగణిస్తారు.

    దీపావళి పండుగకు ముందుగానే,వాయు నాణ్యత తీవ్రంగా తగ్గుముఖం పట్టింది.

    పొరుగున ఉన్న రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెట్టడం,అదే సమయంలో దిల్లీ మీదుగా పొగమంచు అలుముకోవడం వలన వాయు నాణ్యత మరింతగా పడిపోయింది.

    వివరాలు 

    దిల్లీ వాయు నాణ్యతపై కొనసాగుతున్న దృష్టి 

    దీంతో,ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(Air Quality Index)అధ్వాన స్థాయికి చేరిందని కాలుష్య నియంత్రణ మండలి తెలియజేసింది.

    ఈ పరిస్థితులను అదుపు చేయడానికి, ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

    వాహన వినియోగం, పారిశుధ్య నియమాలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక మార్గాలను క్రమబద్ధీకరిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    దిల్లీ

    Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్
    Delhi CM : దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి..? అరవింద్ కేజ్రీవాల్
    Delhi: దిల్లీ మెట్రోలో భద్రతా పెంపు.. రహస్య పోలీసు అధికారుల మోహరింపు  పోలీస్
    Delhi next CM : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత తదుపరి సీఎం ఎవరు?  అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025