Delhi blast: ఎర్రకోట పేలుడు దర్యాప్తులో కొత్త ట్విస్ట్.. కారు డ్రైవర్కు అక్రమ మార్గాల ద్వారా రూ.20 లక్షలు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ పేలుడు దేశాన్ని షాక్కు గురిచేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో పార్క్ చేసిన ఐ-20 కారులో అకస్మాత్తుగా విస్పోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో అధికారులు పలు ముఖ్యమైన విషయాలను బయటపెట్టారు (Delhi explosion investigation).
వివరాలు
అమోనియం నైట్రేట్-ఇంధన నూనె.. ఎర్రకోట బ్లాస్ట్కు కారణం
కారును నడిపిన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ నబీ పెద్దఎత్తున అక్రమ మార్గాల్లో రూ.20 లక్షలు వ్యవహరించినట్టుగా తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది (i20 driver news). ఆ మొత్తంతో హర్యానాలోని నుహ్ ప్రాంతంలోని ఒక దుకాణం నుంచి అతడు భారీగా అమోనియం నైట్రేట్ కొనుగోలు చేసినట్టు తెలిసింది. అమోనియం నైట్రేట్-ఇంధన నూనెతో తయారుచేసిన పేలుడు సమ్మేళనమే ఎర్రకోట బ్లాస్ట్కు కారణమని అధికారులు నిర్ధారించారు. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో 1989లో జన్మించిన ఉమర్ నబీ, ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీకి చెందిన పలువురిని పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు (terror funding sources).
వివరాలు
2,900 కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం
ఎర్రకోట పేలుడుకు కొన్ని గంటల ముందు నిఘా శాఖలు కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో విస్తరించిన జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించి, ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది (Delhi crime news). అదేవిధంగా 2,900 కిలోల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉమర్ నబీకి భారీగా డబ్బులు ఏ మార్గాల్లో చేరాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనేక హవాలా డీలర్లను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.