NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Farmers Protest: 'ఢిల్లీ చలో' మార్చ్‌కు రైతులు తాత్కాలిక విరామం.. కొత్త MSP ప్రణాళికను ప్రతిపాదించిన కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    Farmers Protest: 'ఢిల్లీ చలో' మార్చ్‌కు రైతులు తాత్కాలిక విరామం.. కొత్త MSP ప్రణాళికను ప్రతిపాదించిన కేంద్రం 
    'ఢిల్లీ చలో' మార్చ్‌కు రైతులు తాత్కాలిక విరామం

    Farmers Protest: 'ఢిల్లీ చలో' మార్చ్‌కు రైతులు తాత్కాలిక విరామం.. కొత్త MSP ప్రణాళికను ప్రతిపాదించిన కేంద్రం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2024
    08:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పంటలకు కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రతిపాదించడంతో,ఈ ప్రతిపాదనను రానున్న రెండు రోజుల్లో అధ్యయనం చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు.

    అప్పటి వరకు ఢిల్లీ చలో మార్చ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చారు.

    వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్,హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఆదివారం చండీగఢ్‌లో రైతు నాయకులతో నాల్గవ రౌండ్ చర్చలు, జరిపారు.

    సమావేశం అనంతరం పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ.. రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ సంస్థల ద్వారా కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ప్యానెల్ ప్రతిపాదించినట్లు తెలిపారు.

    Details 

    కొనుగోలుపై ఎటువంటి పరిమితి ఉండదు

    "ఎన్‌సిసిఎఫ్ (నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్), నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) వంటి సహకార సంఘాలు 'పప్పు ధాన్యాలు పండించే రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయని, వచ్చే ఐదేళ్లపాటు తమ పంటను ఎంఎస్‌పీతో కొనుగోలు చేస్తాం'' అని చెప్పారు.

    కొనుగోలుపై ఎటువంటి పరిమితి ఉండదని ప్రకటించారు. దీని కోసం ఒక పోర్టల్ ను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

    ప్రభుత్వ ప్రతిపాదనపై మరో రెండు రోజుల్లో తమ చర్చా వేదికల్లో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామని రైతు నాయకులు తెలిపారు.

    ఫిబ్రవరి 19-20 తేదీల్లో మా ఫోరమ్‌లలో చర్చించి దీనిపై నిపుణుల అభిప్రాయం తీసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.

    Details 

    రుణమాఫీ,ఇతర డిమాండ్లపై చర్చలు పెండింగ్‌

    రుణమాఫీ,ఇతర డిమాండ్లపై చర్చలు పెండింగ్‌లో ఉంది,రాబోయే రెండు రోజుల్లో ఇవి పరిష్కారమవుతాయని మేము ఆశిస్తున్నాము,ప్రస్తుతం 'ఢిల్లీ చలో' మార్చ్ కు తాత్కాలిక విరామం ఇచ్చామని,అయితే ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభమవుతుందని పంధర్ అన్నారు.

    ఇంతకుముందు ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లో కేంద్రమంత్రులు, రైతు నేతలు సమావేశమైనప్పటికీ చర్చలు కొలిక్కిరాలేదు.

    తమ డిమాండ్ల కోసం సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) కిసాన్ మజ్దూర్ మోర్చా మార్చ్‌కు పిలుపునిచ్చాయి.

    Details 

    ఎంఎస్‌పికి చట్టపరమైన హామీతో పాటు ఇతర డిమాండ్లు 

    ఎంఎస్‌పికి చట్టపరమైన హామీతో పాటు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, వ్యవసాయ రుణమాఫీ, విద్యుత్ ఛార్జీల పెంపుదల, పోలీసు కేసుల ఉపసంహరణ ,2021 బాధితులకు "న్యాయం" చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

    లఖింపూర్ ఖేరీ హింస, భూసేకరణ చట్టం, 2013 పునఃస్థాపన, 2020-21లో గతంలో జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్‌ చేసిన ఇంజినీర్‌.. మహారాష్ట్రలో అరెస్టు మహారాష్ట్ర
    GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే! ముంబయి ఇండియన్స్
    Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం భారతదేశం

    కేంద్ర ప్రభుత్వం

    నేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్  దిల్లీ
    ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 21.8 శాతం పెరుగుదల.. రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు  ఆర్థిక శాఖ మంత్రి
    చైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు  భారతదేశం
    ఆకలి సూచిక : పాకిస్తాన్ కంటే దిగువ స్థానంలో భారత్.. సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం  ఆహారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025