దిల్లీ సీఎం కేజ్రీవాల్ బర్త్ డే.. ఎంత మంది విష్ చేసినా మనీశ్ను మిస్ అవుతున్నానంటూ ట్వీట్
దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న వేళ తన సహచరుడు, స్నేహితుడు, దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఎమోషనల్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్ సీఎం నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మహారాష్ట్ర ఆదిత్య థాకరే కేజ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కేజ్రీవాల్కు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎంతమంది ప్రముఖులు విషెష్ అందజేసినా తన బెస్ట్ ఫ్రెండ్ మనీశ్ సిసోడియాను మాత్రం తలుచుకోకుండా ఉండలేకపోయారు ఈ సీఎం.
సెప్టెంబర్ 4న దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా లిక్కర్ స్కామ్ కేసు విచారణ
మనీష్ను ఎంతో మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ నా పుట్టినరోజు. చాలా మంది జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చాలా థాంక్స్. కానీ మనీష్ సిసోడియాని మిస్ అవుతున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆయన తప్పుడు కేసులో జైలు పాలయ్యాడు. ఇవాళ అందరూ ప్రతిజ్ఞ చేద్దాం. భారత్ లో జన్మించిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించేందుకు శక్తి మేరకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. భారత్కు ఇదే బలమైన పునాది వేస్తుందన్నారు. ఇండియాను నంబర్ వన్ చేయాలనే మా కలను నేరవేర్చడంలో సహకరిస్తుందన్నారు. ఇది మనీష్ను సంతోషపరుస్తుందన్నారు. మరోవైపు సెప్టెంబర్ 4న దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా లిక్కర్ స్కామ్ కేసు విచారణ జరగనుంది.