Page Loader
Arvind kejriwal: మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు..
Arvind kejriwal: మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు..

Arvind kejriwal: మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2024
08:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం పెద్ద ఊరట లభించింది. లక్ష రూపాయల పూచీకత్తుపై అయనకి బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్‌ను వ్యతిరేకించేందుకు ఈడి 48 గంటల సమయం కోరింది. రేపు డ్యూటీ జడ్జి ముందు ఈ వాదనలు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. రూ.లక్ష బాండ్‌పై కేజ్రీవాల్ రేపు శుక్రవారం తీహార్ జైలు నుంచి బయటకు రావచ్చని రూస్ అవెన్యూ కోర్టు తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు..

మీరు
33%
శాతం పూర్తి చేశారు

పాలసీ 

మద్యం పాలసీ ఏమిటి? 

ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్‌లో కొత్త మద్యం పాలసీని అమలులోకి తెచ్చింది. ఇందులో ప్రైవేట్ మద్యం కంపెనీలకు మద్యం కాంట్రాక్టులు ఇచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ఈ విధానంలో అవినీతికి భయపడి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేత దర్యాప్తుకు సిఫార్సు చేశారు. తర్వాత ఈడీ కూడా విచారణలో పాల్గొంది. ఢిల్లీ ప్రభుత్వం మద్యం కంపెనీల నుంచి లంచం తీసుకుని పాలసీ ద్వారా ప్రయోజనాలను కల్పించి మద్యం కాంట్రాక్టులు ఇచ్చిందని ఆరోపించారు.

మీరు
66%
శాతం పూర్తి చేశారు

వివరాలు 

జూన్ 2న లొంగిపోయిన  కేజ్రీవాల్ 

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జూన్ 1 వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మధ్య తన ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంటూ సుప్రీంకోర్టు,ట్రయల్ కోర్టులో బెయిల్ వ్యవధిని పొడిగించాలని కోరారు, అయితే అతనికి రెండు చోట్లా ఉపశమనం లభించలేదు. కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆప్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియంతృత్వ పాలన నుంచి దేశాన్ని కాపాడేందుకే జైలుకు వెళ్తున్నానని జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఆప్‌ నేత, దిల్లీ మంత్రి అతిశీ సత్యం గెలిచిందన్నారు. సత్యానికి కొన్నిసార్లు ఇబ్బందులు రావొచ్చేమో గానీ.. ఓటమి మాత్రం ఉండదన్నారు.

మీరు
100%
శాతం పూర్తి చేశారు