NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi liquor scam: కేజ్రీవాల్,సిసోడియా,కవితల జ్యుడీషియల్ కస్టడీని పొడగించిన ఢిల్లీ కోర్టు 
    తదుపరి వార్తా కథనం
    Delhi liquor scam: కేజ్రీవాల్,సిసోడియా,కవితల జ్యుడీషియల్ కస్టడీని పొడగించిన ఢిల్లీ కోర్టు 
    కేజ్రీవాల్,సిసోడియా,కవితల జ్యుడీషియల్ కస్టడీని పొడగించిన ఢిల్లీ కోర్టు

    Delhi liquor scam: కేజ్రీవాల్,సిసోడియా,కవితల జ్యుడీషియల్ కస్టడీని పొడగించిన ఢిల్లీ కోర్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 31, 2024
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు.

    సీబీఐకి సంబంధించిన కేసులో వారి జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 9 వరకు కోర్టు పొడిగించింది.

    వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముగ్గురు నేతలు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మాత్రమే పొడిగించారు. ఈడీ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది.

    వివరాలు 

    ఈడీ, సీబీఐ దర్యాప్తు పూర్తయింది 

    ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ, సీబీఐల దర్యాప్తు పూర్తయింది.

    సిఎం కేజ్రీవాల్‌పై సిబిఐ సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

    అదే సమయంలో, ఈ కేసులో ఇప్పటికే ED ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత దుర్గేష్ పాఠక్, వ్యాపారవేత్త పి శరత్ చంద్రారెడ్డి, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్, అమిత్ అరోరా పేర్లను సీబీఐ సోమవారం దాఖలు చేసిన చార్జిషీట్‌లో చేర్చింది.

    ఆగస్టు 12న సీబీఐ చార్జిషీట్‌పై విచారణ జరగనుంది.

    వివరాలు 

    బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులు 

    సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం తన తీర్పును రిజర్వ్ చేసింది.

    విచారణ సందర్భంగా, కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి కేజ్రీవాల్ సూత్రధారి అని వాదించింది.

    మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

    అంతకుముందు, జూన్ 20న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది, అయితే మరుసటి రోజే ఈడీ ఢిల్లీ హైకోర్టుకు చేరుకుని దానిపై స్టే తీసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ లిక్కర్ స్కామ్‌

    తాజా

    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్

    దిల్లీ లిక్కర్ స్కామ్‌

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు దిల్లీ
    ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్ కల్వకుంట్ల కవిత
    దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025