LOADING...
Delhi Exit Polls: దిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
దిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?

Delhi Exit Polls: దిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీని ఎవరు పాలించబోతున్నారు? ఏ పార్టీ విజయం సాధించబోతుంది? ఎన్నికల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఏ నేత అధిరోహించబోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అందించబోయే కీలక ఘట్టాన్ని కొద్ది గంటల్లోనే చూడబోతున్నాం. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈరోజు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ,భారతీయ జనతా పార్టీ,కాంగ్రెస్ మధ్య ఉత్కంఠభరితమైన త్రిముఖ పోటీ నెలకొంది. 27 ఏళ్లుగా ఢిల్లీ గద్దెను తాకలేకపోయిన బీజేపీ ఈసారి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తుంటే, ఆప్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉంది. అదే సమయంలో,2013 తర్వాత కాంగ్రెస్ తిరిగి పోటీకి సిద్ధమవుతూ కొత్త ఉత్సాహాన్ని కనబరుస్తోంది. ఈ ఎన్నికల అనంతరం అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అంచనాలపై ఉంది.

వివరాలు 

ఒక్క దశలో పోలింగ్ - ఫలితాల కోసం ఎదురు చూపు 

ఢిల్లీ అసెంబ్లీకి ఈసారి ఫిబ్రవరి 5న ఒక్క దశలోనే పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఫిబ్రవరి 3వ తేదీన ముగిసింది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8న జరగనుంది. అయితే అసలైన ఫలితాల ముందు, నేడు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడతాయి. ఇవి ఎన్నికల ఫలితాల దిశను సూచించేలా ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్ - ఓటింగ్ అనంతరం అంచనాలు ఈరోజు సాయంత్రం ఓటింగ్ పూర్తయ్యే సరికి పలు టీవీ ఛానెల్స్, ఎన్నికల అధ్యయన సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేయనున్నాయి. ఓటింగ్ ముగిసిన వెంటనే ఈ అంచనాలను రూపొందిస్తారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితమైన ఫలితాలను సూచిస్తాయని చెప్పలేం. గతంలో అనేక సందర్భాల్లో ఈ అంచనాలు తప్పుగా నిరూపితమయ్యాయి.

వివరాలు 

ఎగ్జిట్ పోల్స్ విడుదల సమయం 

ఎగ్జిట్ పోల్స్ ప్రకటనకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను విధించింది. ఎన్నికల నియమావళి ప్రకారం, ఈరోజు సాయంత్రం 6.30 గంటల ముందు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేయరాదు. ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్ మీడియా వేదికల ద్వారా 6.30 గంటల తర్వాతే ఈ అంచనాలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఎక్కడ చూడొచ్చు? ఓటింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడికానున్నాయి. ఇవి ఫిబ్రవరి 8న వెలువడే అధికారిక ఫలితాలకు సమీప అంచనాలను ఇస్తాయి. యాక్సిస్ మై ఇండియా,సివోటర్, ఇప్సోస్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడిస్తాయి.