NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Fog : దిల్లీలో చలిపంజా.. బెంబెలెత్తుతున్న రాజధాని వాసులు.. తమిళనాడుకు భారీ వర్ష సూచన
    తదుపరి వార్తా కథనం
    Delhi Fog : దిల్లీలో చలిపంజా.. బెంబెలెత్తుతున్న రాజధాని వాసులు.. తమిళనాడుకు భారీ వర్ష సూచన
    దిల్లీలో చలిపంజాతో బెంబెలెత్తుతున్న రాజధాని వాసులు.. తమిళనాడుకు భారీ వర్ష సూచన

    Delhi Fog : దిల్లీలో చలిపంజా.. బెంబెలెత్తుతున్న రాజధాని వాసులు.. తమిళనాడుకు భారీ వర్ష సూచన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 15, 2023
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయ రాజధాని దిల్లీ వాసులు చలితో గడ్డకట్టుకుపోతున్నారు. ఉదయం అత్యంత కనిష్ఠంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

    లోధిరోడ్‌లో 5, అయానగర్‌లో అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యంత కనిష్ఠంగా హర్యానాలోని హిసార్‌లో 4.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

    దిల్లీ(NCR) పరిధిలోని పలు ప్రాంతాలు సహా పంజాబ్‌ దట్టమైన మంచులో చిక్కుకుంది. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, అస్సాం,మేఘాలయ, త్రిపురలోనూ పొగమంచు కమ్ముకుంది. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో 500 మీటర్లకు మించి ఏమీ కనపడటం లేదు.

    మరోవైపు భారత వాతావరణ శాఖ గురువారమే హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం వాతావరణంలో చలి తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.

    ఇదే సమయంలో వారం మొత్తం వాతావరణం ఇలాగా చల్లగా, పొగమంచుతో నిండి ఉంటుందని వివరించింది.

    DETAILS

    దిల్లీని కప్పేసిన మంచు పొగ

    వచ్చే వారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.

    వచ్చే నాలుగైదు రోజుల్లో దిల్లీని పొగమంచు కప్పేస్తుందని ఐఎండీ అంచనా వేసింది. దిల్లీలో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదై గాలి నాణ్యత మరింత దిగజారింది.

    తమిళనాడులో భారీ వర్షాలు :

    నైరుతి అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ బంగాళాఖాతంలోనూ తుపాను వచ్చే అవకాశం ఉందని, లేదంటే అల్పపీడనం ఏర్పడనున్నట్లు వివరించింది.

    దక్షిణ భారతదేశం, తమిళనాడులో నేటి నుంచి వచ్చే మూడు రోజులపాటు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

    ఈనెల 17న కేరళ, లక్షద్వీప్‌ల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రాన్ని కోరిన పర్యావరణ మంత్రి ఇండియా
    Manish Sisodia:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా
    Delhi: 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో డాక్యుమెంటరీ మేకర్ మృతి  రోడ్డు ప్రమాదం
    ఢిల్లీ ఐఐటీలో విషాదం..  ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025