NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రమాదవశాత్తు ఒంటిపై హాట్ చాక్లెట్ పడి బాలికకు గాయాలు.. విస్తారా విమానంలో ఘటన
    తదుపరి వార్తా కథనం
    ప్రమాదవశాత్తు ఒంటిపై హాట్ చాక్లెట్ పడి బాలికకు గాయాలు.. విస్తారా విమానంలో ఘటన
    ప్రమాదవశాత్తు ఒంటిపై హాట్ చాక్లెట్ పడి బాలికకు గాయాలు

    ప్రమాదవశాత్తు ఒంటిపై హాట్ చాక్లెట్ పడి బాలికకు గాయాలు.. విస్తారా విమానంలో ఘటన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 17, 2023
    10:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విస్తారా ఎయిర్‌లైన్స్ విమానం గాల్లో ఉండగానే ఓ బాలిక గాయాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

    ఈ మేరకు పదేళ్ల బాలిక ఒంటిపై హాట్ చాక్లెట్ పడిందని, దీంతో ఆమెకు గాయాలయ్యాయని సదరు విమానయానం సంస్థ ప్రకటించింది.

    కిందటి వారం తమ సంస్థకు చెందిన ఓ విమానంలో ప్రయాణిస్తున్న బాలిక ఒంటిపై గాయమైందని పేర్కొంది.

    ఈ క్రమంలోనే బాధితురాలి చికిత్సకు అయ్యే ఖర్చును చెల్లిస్తామని చెప్పుకొచ్చింది. ఆగస్ట్ 11న దిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌ (జర్మనీ)కి బయలుదేరిన UK-25 విమానంలో ఈ ఘటన జరిగింది.

    బాలిక తల్లిదండ్రుల సూచన మేరకు తమ సిబ్బంది సదరు చిన్నారికి హాట్ చాక్లెట్ అందించారు.ఈ క్రమంలో చిన్నారి ఆకతాయితనంతో ప్రమాదవశాత్తు వేడివేడి హాట్ చాక్లెట్ బాలిక ఒంటిపై పడింది.

    details

    సిబ్బంది సరిగ్గా నడుచుకోలేదు : రచనా గుప్తా  

    ఎయిర్‌లైన్స్ నిబంధనల మేరకు తమ సిబ్బంది(పారా మెడికల్) బాలికకు ప్రాథమిక చికిత్స అందించారని విస్తారా సంస్థ వెల్లడించింది.

    విమానం గమ్యస్థానానికి చేరుకోగానే బాధితురాలి కోసం అంబులెన్స్ ను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఆస్పత్రికి తరలించామని పేర్కొంది.

    ఎయిర్‌ హోస్టస్ ఏమరపాటు వల్లే పాపకు సెకెండ్ డిగ్రీ గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    అయితే దీనిపై స్పందించిన విస్తారా విమానాశ్రయం దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనలో సిబ్బంది సరిగ్గా నడుచుకోలేదని రచనా గుప్తా ఆరోపించింది.

    ఘటనపై కనీసం సారీ చెప్పలేదని సదరు మహిళ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం గమనార్హం. మరోవైపు ఘటన తర్వాత బాధిత ప్యాసింజర్ కుటుంబానికి తమ సిబ్బంది అందుబాటులో ఉన్నారని విస్తారా చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025