Page Loader
మరోసారి వివాదాస్పదమైన ఇండిగో.. ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం
ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం

మరోసారి వివాదాస్పదమైన ఇండిగో.. ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 06, 2023
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరో వివాదానికి కేంద్ర బిందుగా మారింది. చండీగఢ్‌ నుంచి జైపుర్‌కు శనివారం బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 10-15 నిమిషాల పాటు తమను ఎండలోనే క్యూలో నిలబడేలా చేశారని, విమానంలోకి ప్రవేశించాక ఏసీలు పనిచేయలేదని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం టేకాఫ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు చెమటలు కక్కారు. వేడికి తట్టుకోలేక మరికొందరు కాగితాలతో విసురుకున్నారు. చెమటను తుడుచుకునేందుకు ఎయిర్‌ హోస్టెస్‌ టిష్యూలను అందించారని అమరీందర్ సింగ్ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు డీజీసీఏకు, AAIకు ట్యాగ్‌ చేసిన సింగ్, సదరు ఎయిర్‌లైన్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విమానంలో దుస్థితిపై అమరిందర్ సింగ్ చేసిన ట్వీట్