NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Pollution:దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌
    తదుపరి వార్తా కథనం
    Delhi Pollution:దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌
    దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌

    Delhi Pollution:దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 20, 2024
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు తీవ్రంగా క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ 400కు పైగా నమోదు అవుతోంది. ఈ పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

    వాయు కాలుష్యాన్ని అదుపులో పెట్టేందుకు 50శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని ఆదేశించింది.

    కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, తద్వారా ప్రభుత్వ కార్యాలయాలు తగ్గిన శక్తితో పనిచేస్తాయని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అని తెలిపారు.

    ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో కూడా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ చర్యలను అమలు చేయడానికి సంబంధించి ఇవాళ సచివాలయ అధికారులతో సమావేశం జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    Details

    విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

    దిల్లీలోని మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఇతర ప్రాంతాలలోని కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.

    గాలి నాణ్యత సూచీ ఈ ఉదయం 422గా నమోదవడంతో, కొన్ని ప్రాంతాల్లో ఇది 500కి చేరిపోయింది.

    ఇప్పటికే పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాలుష్య కారణంగా సుప్రీంకోర్టులో పలు కేసులు వర్చువల్ మోడ్‌లోనే విచారిస్తామని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తెలిపారు.

    ఈ పరిస్థితిలో, కృత్రిమ వర్షం కురిపించేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలని గోపాల్ రాయ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ప్రభుత్వం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    Amit Shah: మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం.. అమిత్ షా  అమిత్ షా
    Chandrababu: దిల్లీ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    Elections: జమ్ముకశ్మీర్,హర్యానా తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు.. త్వరలోనే ప్రకటన  ఎన్నికలు
    Delhi: నమ్‌కీన్ ప్యాకెట్లలో ₹2,000 కోట్ల కోట్ల డ్రగ్స్.. ఢిల్లీ వ్యక్తి అరెస్ట్ భారతదేశం

    ప్రభుత్వం

    WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు  దిల్లీ
    Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి  తెలంగాణ
    Anganwadi Workers: జగన్ మాట మార్చాడు.. ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారు : అంగన్‌వాడీ వర్కర్స్  ఆంధ్రప్రదేశ్
    Kerala Govt: రైతును చంపి తినేసిన పులి.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025