NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gopal Rai: దిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో కేంద్రానికి పర్యావరణశాఖ మంత్రి లేఖ
    తదుపరి వార్తా కథనం
    Gopal Rai: దిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో కేంద్రానికి పర్యావరణశాఖ మంత్రి లేఖ
    దిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో కేంద్రానికి పర్యావరణశాఖ మంత్రి లేఖ

    Gopal Rai: దిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో కేంద్రానికి పర్యావరణశాఖ మంత్రి లేఖ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 19, 2024
    01:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత తీవ్రంగా దిగజారుతోంది.

    ఈ నేపథ్యంలో వాయు కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించే చర్యలను చేపట్టాలని దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రాన్ని కోరారు.

    ఈ మేరకు ఆయన కేంద్రానికి లేఖ రాసినట్లు మీడియాతో వెల్లడించారు.

    వివరాలు 

    కేంద్రానికి దిల్లీ మంత్రి విజ్ఞప్తి 

    "ఉత్తర భారతదేశాన్ని పొగమంచు పూర్తిగా కమ్మేస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కృత్రిమ వర్షమే సరైన పరిష్కారం. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవడం అవసరం. గత మూడు నెలలుగా కృత్రిమ వర్షంపై కేంద్రానికి లేఖలు రాస్తున్నా, కానీ ఇంకా స్పందన లేదు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. లేకపోతే తన పదవికి రాజీనామా చేయాలి," అని గోపాల్ రాయ్ స్పష్టం చేశారు.

    వివరాలు 

    పొగమంచు ప్రభావం..తీరని ఇబ్బందులు 

    మరోవైపు, మంగళవారం కూడా దిల్లీని పొగమంచు పూర్తిగా కప్పేసింది. దీంతో గాలి నాణ్యత సూచీ (AQI) 494కు పడిపోయింది.

    కొన్ని ప్రాంతాల్లో ఇది 500 మార్క్‌ను కూడా దాటింది.వాతావరణ శాఖ అధికారుల ప్రకారం, వరుసగా రెండో రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది.

    ప్రయాణాలకు తీవ్ర అంతరాయం

    పొగమంచు కారణంగా దూరం నుంచి వస్తున్న వాహనాలు కనిపించకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తాయి.

    పలు విమానాలు, రైళ్లు ఆలస్యమవుతుండగా,కొన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ప్రయాణికులు తమ ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించుకోవాలని ఎయిర్‌లైన్స్ ప్రత్యేక సూచనలను విడుదల చేశాయి.

    వాయు కాలుష్యం వల్ల కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని,దీని నియంత్రణ కోసం కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    Sonam Wangchuk: లద్దాఖ్‌ భవన్‌లో నిరాహార దీక్షకు దిగిన సోనమ్‌ వాంగ్‌చుక్ ఇండియా
    Amit Shah: మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం.. అమిత్ షా  అమిత్ షా
    Chandrababu: దిల్లీ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    Elections: జమ్ముకశ్మీర్,హర్యానా తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు.. త్వరలోనే ప్రకటన  ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025