Page Loader
Arvind Kejriwal: కేజ్రీవాల్'ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని పిటిషన్.. న్యాయవాది పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా 
Arvind Kejriwal: కేజ్రీవాల్'ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని పిటిషన్

Arvind Kejriwal: కేజ్రీవాల్'ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని పిటిషన్.. న్యాయవాది పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా 

వ్రాసిన వారు Stalin
May 08, 2024
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21వ తేదీ నుంచి జైలులో ఉన్నారు. మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని పట్టుదలగా ఉన్నారు. తమ అధినేత సీఎం పదవికి రాజీనామా చేయరని, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. శ్రీకాంత్ ప్రసాద్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

Details 

 ఎమర్జెన్సీ విధించాలా లేక మిలటరీ పాలన 

ఎమ్మెల్యేలు, కేబినెట్‌ సభ్యులతో కేజ్రీవాల్‌ మాట్లాడేందుకు వీలుగా వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని జైలు డీజీని ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించి శ్రీకాంత్ ప్రసాద్‌ అనే న్యాయవాదికి రూ.లక్ష జరిమానా కూడా విధించింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా, రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయకుండా మీడియాను నిలిపివేయాలని పిటిషన్‌లో శ్రీకాంత్ ప్రసాద్ డిమాండ్ చేశారు. దీనిపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎమర్జెన్సీ విధించాలా లేక మిలటరీ పాలన విధించాలా అని ప్రశ్నించింది.