NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ
    దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ

    దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ

    వ్రాసిన వారు Stalin
    Mar 06, 2023
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను వారం రోజుల రిమాండ్ ముగియడంతో సీబీఐ సోమవారం రోస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ క్రమంలో సిసోడియాను 14రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అంటే మార్చి 20 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.

    ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం రద్దు చేసిన 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో సిసోడియాను సీబీఐ గత వారం అరెస్టు చేశారు.

    సిసోడియా

    సిసోడియాకు భగవద్గీత, డైరీ, పెన్ను ఇవ్వాలని కోర్టు ఆదేశం

    కళ్లద్దాలు, భగవద్గీత, డైరీ, పెన్ను ఇవ్వాలని కోరుతూ సిసోడియా పెట్టుకున్న దరఖాస్తును కూడా కోర్టు అనుమతించింది. విపాసన (ధ్యానం) సెల్‌లో ఉంచాలన్న సిసోడియా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.

    విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ప్రశ్నలను పదేపదే అడుగుతూ తనను మానసికంగా వేధించిందని సిసోడియా ఆరోపించారు.

    ఇదిలా ఉంటే, సిసోడియా అరెస్టుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అతనిని వెంటనే విడుదల చేయాలని పలు ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీ లేఖ రాశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    మనీష్ సిసోడియా

    తాజా

    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్
    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం

    దిల్లీ

    నేడు దిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన నరేంద్ర మోదీ
    దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి రోడ్డు ప్రమాదం
    బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు నరేంద్ర మోదీ
    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    మనీష్ సిసోడియా

    మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025