Page Loader
Delhi: అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి బెదిరింపు సందేశాలు రాసిన వ్యక్తి అరెస్టు 
అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి బెదిరింపు సందేశాలు రాసిన వ్యక్తి అరెస్టు

Delhi: అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి బెదిరింపు సందేశాలు రాసిన వ్యక్తి అరెస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2024
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని బెదిరింపు సందేశాలు రాసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి అంకిత్ గోయల్(32) గా గుర్తించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఢిల్లీ పోలీసుల మెట్రో యూనిట్ కేసు దర్యాప్తు చేస్తోంది. నిందితుడు బరేలీ నివాసి,అని అతడు ప్రముఖ బ్యాంకులో పనిచేస్తున్నాడని పోలీసులుతెలిపారు . నిందితుడికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం అతను మానసికంగా బాగానే ఉన్నాడని, గతంలో కేజ్రీవాల్‌కు మద్దతుగా జరిగిన పలు ర్యాలీలలో కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు.

Details 

 ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు 

మంగళవారం తెల్లవారుజామున, నిందితుడు నినాదాలు రాసినట్లు సీసీటీవీ కెమెరాల్లో కనిపించిందని పోలీసులు తెలిపారు. మెట్రో రైళ్లలో, స్టేషన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాయడం కనిపించడంతో పోలీసులు సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై ఓ అధికారి మాట్లాడుతూ, 'సీసీటీవీ ఫుటేజీలో ఓ యువకుడు సైన్‌బోర్డ్‌పైనా,కోచ్‌పైనా రాస్తున్నట్లు కనిపించింది.తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసిన నినాదాల చిత్రాలను షేర్ చేసిన వ్యక్తి ఇతడేనని అనుమానిస్తున్నారు. మంగళవారం పటేల్ నగర్,రమేష్ నగర్,రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ల నుంచి పోలీసులు ఫుటేజీని సేకరించినట్లు తెలిపారు. మెట్రో రైళ్లలో,స్టేషన్లలో వ్రాసిన కొన్ని సందేశాల ఛాయాచిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అంకిత్ గోయల్ 91లో షేర్ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

Details 

సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు 

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించి కొన్ని మెట్రో రైళ్లలో, స్టేషన్లలో రాసిన సందేశాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాతలకు బీజేపీనే కారణమని ఆరోపించింది. ఈ అంశంపై సమావేశానికి ఎన్నికల కమిషన్ నుండి సమయం కోరింది. మెట్రో కోచ్ లోపల రాయడంపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) నుంచి ఫిర్యాదు అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మెట్రో) జి రామ్ గోపాల్ నాయక్ తెలిపారు. తదుపరి విచారణ కోసం రాజౌరి గార్డెన్ మెట్రో పోలీస్ స్టేషన్‌లో సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేయబడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్