Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఆరో నిందితుడు మహేష్ కుమావత్ను శనివారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తొలుత మహేష్ కుమావత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంటల తరబడి విచారణ చేసి.. అనంతరం అరెస్టు చేశారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో 'మాస్టర్ మైండ్' లలిత్ ఝా దిల్లీ నుంచి తప్పించుకోవడానికి సహకరించాడన్న ఆరోపణలపై మహేష్ కుమావత్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన లలిత్ ఝాను గత రాత్రి అరెస్టు చేసిన తర్వాత శుక్రవారం ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. పార్లమెంటు భద్రతను ఉల్లంఘించేందుకు కుట్ర పన్నేందుకు నిందితులు చాలాసార్లు సమావేశమైనట్లు లలిత్ ఝా పోలీసుల విచారణలో అంగీకరించారని పాటియాలా హౌస్ కోర్టులో పోలీసులు పేర్కొన్నారు.